AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: తమాషాలేస్తున్నారు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్‌

ప్రజలకు నిజాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం.. శ్వేతపత్రాలను తేలిగ్గా తీసుకోవద్దు.. రాష్ట్ర పరిస్థితిని తెలిపేందుకే వైట్‌పేపర్స్‌ తీసుకొస్తున్నాం.. రాష్ట్ర ఆర్థిక దుస్థితి తవ్వినకొద్దీ బయటకొస్తోంది.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్‌శాఖ పరిస్థితిపై సీఎం చంద్రబాబు మంగళవారం శ్వేతపత్రం విడుదల చేశారు.

Chandrababu: తమాషాలేస్తున్నారు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్‌
Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2024 | 5:59 PM

Share

ప్రజలకు నిజాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం.. శ్వేతపత్రాలను తేలిగ్గా తీసుకోవద్దు.. రాష్ట్ర పరిస్థితిని తెలిపేందుకే వైట్‌పేపర్స్‌ తీసుకొస్తున్నాం.. రాష్ట్ర ఆర్థిక దుస్థితి తవ్వినకొద్దీ బయటకొస్తోంది.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్‌శాఖ పరిస్థితిపై సీఎం చంద్రబాబు మంగళవారం శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ కోసం సరైన ఏర్పాట్లు చేయలేదని.. అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ సూచించారు. తమాషాలేస్తున్నారని.. అధికారులకు ఇంకా పాతవాసనలు పోలేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. సరిగా పనిచేయడం లేదు.. ఇంకా అందర్నీ సెట్‌ చేయాల్సి ఉందని.. చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా.. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను ధ్వంసం చేసిందంటూ పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖలో లక్షా29వేల 503 కోట్ల అప్పులున్నాయన్నారు. ఐదేళ్లలో ఇష్టానుసారం వ్యవహరించారు.. అసమర్థపాలనతో ఎంత నష్టమనే దానికి ఇదే ఉదాహరణ అంటూ పేర్కొన్నారు. ఏ శాఖ చూసినా తీవ్ర పరిస్థితులున్నాయని.. ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారని.. మెరుగైన పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

వీడియో చూడండి..

2014 నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచామని.. విద్యుత్ సంస్కరణలతో మిగులు విద్యుత్ వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. 2018నాటికి ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగిందని.. 2019 నాటికి 14,929 మెగావాట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. 2019-24లో విద్యుత్ సంస్థలపై.. రూ.1.29 లక్షల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. 2019-24 మధ్య విద్యుత్ టారిఫ్ కూడా పెరిగిందన్నారు. ఏపీ ప్రజలపై భారం మోపారని.. అసమర్థపాలనతో ఎంత నష్టమనే దానికి ఇదే ఉదాహరణ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు