AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేటి విశాఖ జిల్లా పర్యటన రద్దు.. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసిన సీఎంవో

AP CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ్టి ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు సిఎంఓ కార్యాలయం ఓ ప్రకటన..

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేటి విశాఖ జిల్లా పర్యటన రద్దు.. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసిన సీఎంవో
Ap Cm Jagan
Follow us

|

Updated on: Oct 23, 2021 | 7:55 AM

AP CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ్టి ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు సిఎంఓ కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విశాఖ టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్న వరం విమానాశ్రమం విశాఖ పర్యటనకు సిఎం బయలుదేరాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖ నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు.. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి కూడా సిఎం జగన్ హాజరుకావాల్సి ఉంది. . నేడు ధర్మశ్రీ కుమార్తె వివాహం విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో వైభవంగా జరగనుంది.

సాయంత్రం 4:45 గంటలకు విశాఖ సిఎం చేరుకొని విశాఖ పట్టణంలోని ఎయిర్ పోర్టు గేట్-1 వద్ద వైసిపీ నేతలతో, ప్రజాప్రతినిధులతో సమవేశంతో పాటు.. ఎన్ఏడీ జంక్షన్ లో ఫ్లైఓవర్, వీఎంఆర్డీఏ ప్రాజెక్టులను సిఎం జగన్ ప్రారంభించనున్నారని సీఎంవో అధికారులు ముందుగా వెల్లడించారు. అనంతరం వుడా పార్క్, జీవీఎంసీ స్మార్ట్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం … అనంతరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె పెళ్లికి హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. కాగా.. ఏపీలో ప్రస్తుతం టీడీపీ మరియు వైసీపీ ల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Also Read: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్..