AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. ఏటా రూ.10వేలు

ఇంటింటికీ వెళ్లి రేషన్ బియ్యం అందించే ఎండీయూ వాహన యజమానులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. ఇకపై వారికి కూడా వాహనమిత్ర స్కీమ్ వర్తింపజేయనుంది.

CM Jagan: వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. ఏటా రూ.10వేలు
Andhra CM Jagan
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2023 | 3:10 PM

Share

ఆంధ్రాలోని జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటి వెళ్లి రేషన్ అందిస్తున్న ఎండియు వాహన ఓనర్స్‌కు కూడా వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ వర్తింపజేయనుంది. ఈ మేరకు గవర్నమెంట్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఓన్ వెహికల్ కలిగి ఉండి.. అర్హత ఉన్న ట్యాక్సీ, ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు జగన్ సర్కార్ వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ కింద.. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున ఇస్తోంది. ఇకపై ఎండియు డ్రైవర్ల‌కు ఈ స్కీమ్ వర్తిస్తుంది. వారికి కూడా అర్హత ఉంటే ప్రతి ఏడాది రూ.10వేలు అందజేస్తారు.

గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది ఎండీయూ వాహన ఓనర్స్‌కు ప్రయోజనం కగలనుంది. వైసీపీ ప్రభుత్వం నిర్ణయంపై ఎండీయూ వాహన యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు అర్థం చేసుకుని… మేలు చేసేందుకు నిర్ణయం తీసుకున్న జగన్‌కు వారంతా థ్యాంక్స్ చెబుతున్నారు.

ప్రజంట్ ఒక్కో రేషన్ డెలివరీ వాహనదారుడికి ప్రతి నెలా రూ.21 వేలు ఇస్తున్నారు. వాటిలో అద్దె కింద రూ.15 వేలు, ఆయిల్ కింద రూ.3 వేలు, హెల్పర్‌ చార్జస్ నిమిత్తం రూ.3 వేలు కేటాయించారు. తొలుత వారి వేతనం రూ.16వేలు ఉండగా.. ఆ తర్వాత 21 వేలకు పెంచిన విషయం తెలిసిందే. కాగా, రేషన్ డోర్ డెలివరీ ప్రొగ్రామ్‌ను 2021లో ప్రారంభించింది ప్రభుత్వం. మొత్తం 9260 వాహనాలను అందజేసింది. బీసీ కార్పొరేషన్‌ ద్వారా 3800, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2300, ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా 1800 మందికి, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 700, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 660,  వాహనాలను అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి