AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అవినీతి ఉద్యోగుల గుండెల్లో గుబులు.. దొరికితే ఇక అంతే..

ACB Cases: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల ఏసీబీ రైడ్స్‌లో చాలామంది ఉద్యోగులు పట్టుబడుతున్న

AP Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అవినీతి ఉద్యోగుల గుండెల్లో గుబులు.. దొరికితే ఇక అంతే..
andhra pradesh government
Shaik Madar Saheb
|

Updated on: Apr 19, 2021 | 12:07 PM

Share

ACB Cases: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల ఏసీబీ రైడ్స్‌లో చాలామంది ఉద్యోగులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ఉద్యోగులపై వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పక్కా ఆధారాలతో దొరికిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 100 రోజులు దాటితే ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయంటూ ప్రభుత్వం వెల్లడించింది. ఏసీబీ డీజీ, శాఖల ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉద్యోగులపై 1995 నుంచి 2020 వరకు మొత్తం 1,686 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిలో 476 అవినీతి కేసులే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

కాగా.. అవినీతి కేసుల్లో ఎప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో ఎక్కువమంది ఉద్యోగులు సస్పెన్షన్‌లో ఉంటున్నారు. ఇలా వారు సుదీర్ఘ కాలం పాటు సస్పెన్షన్‌లో ఉంటూ.. సగం జీతాలు పొందుతున్నారు. అలాంటి వారిపై సత్వర చర్యలు లేకపోవడంతోనే అవినీతి మరింత పెరిగిపోతోందని ఏసీబీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు అవినీతి కేసుల పరిష్కారం కోసం.. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాల పరిమితిని సవరించింది.

అవినీతికి పాల్పడిన అధికారి నేరుగా దొరికితే 24గంటల్లోపు అరెస్టు చేస్తారు. ఏసీబీ కోర్టు వెంటనే ఏపీవీసీకి సమాచారం ఇస్తారు. వెంటనే సంబంధిత శాఖ రెండు రోజుల్లోపు సదరు ఉద్యోగిని సస్పెండ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఏసీబీ అధికారులు ఆయా శాఖలకు 30 రోజుల్లోపు తుది నివేదిక అందించాలి. ఇలా అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల కేసులను 100 రోజుల్లో పరిష్కరించేలా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదలచేసింది.

Also Read:

Covid-19: ‘మహా’ రూల్స్.. ఆ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా రిపోర్ట్ చూపించాల్సిందే..

Delhi Curfew: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాజధానిలో కర్ఫ్యూ.. ఎప్పటినుంచంటే..?

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?