Covid-19: ‘మహా’ రూల్స్.. ఆ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా రిపోర్ట్ చూపించాల్సిందే..

Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే

Covid-19: ‘మహా’ రూల్స్.. ఆ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా రిపోర్ట్ చూపించాల్సిందే..
Maharashtra Coronavirus
Follow us

|

Updated on: Apr 19, 2021 | 10:31 AM

Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, రెమిడెసివిర్ డ్రగ్స్, వ్యాక్సిన్ల కొర‌త ఏర్పడింది. త‌మ రాష్ర్టానికి ఆక్సిజ‌న్ సిలిండర్లను, డ్రగ్స్, వ్యాక్సిన్ డోసులను స‌మ‌కూర్చాల‌ని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, కేరళ, గోవా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా కూడా కరోనా వ్యాప్తి మరింత పెరుగుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ మేరకు మహారాష్ట్ర వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆంక్షలు ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేరళ, గోవా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సిఆర్ రీజియన్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. 48గంటల్లో ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సిందేని స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ నుంచి వచ్చే ప్రయాణికులకు 15 రోజులపాటు హోం క్వారంటైన్ తప్పనిసరని తెలిపింది. ఇదిలాఉంటే.. గత 24గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 68,631 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతోపాటు ఈ మహమ్మారి బారిన పడి 503 మంది మృతి చెందారు. ఎక్కువగా ముంబైలోనే 53వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటూ కరోనా కట్టడికి ప్రయాత్నాలు చేస్తోంది.

Also Read:

Corona: దేశంలో కరోనా విలయతాండవం.. కోటిన్నర దాటిన కేసుల సంఖ్య.. నిన్న కూడా రికార్డు స్థాయిలోనే..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.