Andhra Pradesh: రాష్ట్రంలో 5,251 టీచర్ పోస్టులు ఖాళీలు.. వాటి భర్తీపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అంతా ఆశించారు. అయితే తాజాగా ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులకు..
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అంతా ఆశించారు. అయితే తాజాగా ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులకు నిరాశే కలిగించేలా ఉన్నాయి. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్పై పీడీఎఫ్ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 5,251 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఈ నెలాఖరులోగా 4,134 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. అయితే ఇవి కొత్త డీఎస్సీతో కాకుండా 1998 డిఎస్సీ అభ్యర్దులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే ఇక మిగిలేది కేవలం 717 పోస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై పీడీఎఫ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేలకు పైగా ఖాళీలు ఉంటే ఇలా సమాధానం చెప్పటం సరికాదని అన్నారు. రేష న్నలైజేషన్ లో భాగంగా ఈ పోస్టులను కూడా కుదించారని విమర్శించారు.
2019 అనంతరం ఎన్ని డీఎస్సీలు నిర్వహించారో అడిగితే.. పాత డీఎస్సీ నియామకాల గురించి మాట్లాడడం అన్యాయం అన్నారు. ప్రభుత్వానికి అసలు డీఎస్సీ నిర్వహించే ఆలోచన ఉందా అని పీడీఎఫ్ సభ్యులు నిలదీశారు. ఈ పోస్టుల్లో పాత డీఎస్సీ వారిని భర్తీ చేస్తూన్నామని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలో 67,147 స్కూల్ అసిస్టెంట్లు , 83,495 యస్ జీటీ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారన్న మంత్రి.. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతో సంతృప్తి చెందని పక్షంలో పీడీఎఫ్ సభ్యులతో కలిసి క్షేత్రస్ధాయి పరిశీలన చేసి వారికి వాస్తవాలను వివరిస్తామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..