AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: గన్నవరం ఎయిర్ పోర్ట్ భూనిర్వాసితులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

గన్నవరం ఎయిర్ పోర్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెలలోనే 44 కోట్లు క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు. సుమారు ఏడేళ్లుగా పరిహారం కోసం ఫైట్ చేస్తున్న వారికి ముఖ్యమంత్రి నిర్ణయం ఊరట కలిగిస్తోంది.

Vijayawada: గన్నవరం ఎయిర్ పోర్ట్ భూనిర్వాసితులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్
CM Jagan - MLA Vallabhaneni Vamsi
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2023 | 7:45 PM

Share

రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం ఎయిర్‌ పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది. రన్ వే విస్తరణ కోసం 2016 లో అప్పటి టీడీపీ సర్కార్ భూములను సేకరించింది. ఎయిర్‌పోర్ట్‌ చుట్టుపక్కల 5 గ్రామాలకు చెందిన 662 మంది రైతులు సుమారు 800 ఎకరాల భూములు ప్రభుత్వానికి అప్పగించారు. కొంతమంది భూములతో పాటు ఇళ్లు సైతం కోల్పోయారు. అప్పట్లో ఎమ్మెల్యేగా వంశీ హామీ ఇవ్వడంతో భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఏడేళ్లయినా ఇప్పటికీ పరిహారం అందక పోవడంతో ధర్నాలు చేయడంతో పాటు కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు.

ఇదే విషయంపై గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు..వాస్తవంగా గత ప్రభుత్వం లోనే పరిహారం అందించాల్సి ఉందని.. కానీ పట్టించుకోలేదని ముఖ్యమంత్రికి వివరించారు వంశీ…నిర్వాసితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.వచ్చే నెలలోనే పరిహారం కింద 44 కోట్లు చెల్లిద్దామని వంశీకి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.

ఇప్పటికే నిర్వాసితుల వివరాలు, అందించాల్సిన పరిహారం పై లెక్కలు రెడీ చేశారు అధికారులు. దీనికి అనుగుణంగా నిధులు విడుదల చేసేందుకు సీఎం జగన్ పూర్తి హామీ ఇచ్చినట్లు తెలిసింది. 2016లో చంద్రబాబు సర్కార్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించిందట. ఇప్పుడు వారికి వచ్చే నెల్లోనే నష్ట పరిహారం అందజేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో రైతులు ఊరట చెందారు.

మరిన్ని ఏపీ వార్తలు  కోసం క్లిక్ చేయండి..

తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..