AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం, వైద్యానికి డబ్బులు లేక చేనేత కార్మికుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  వైద్యానికి డబ్బులు లేక ఉరివేసుకొని చేనేత కార్మికుడు చిట్టా రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం, వైద్యానికి డబ్బులు లేక చేనేత కార్మికుడు ఆత్మహత్య
Ram Naramaneni
|

Updated on: Dec 03, 2020 | 12:18 PM

Share

అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  వైద్యానికి డబ్బులు లేక ఉరివేసుకొని చేనేత కార్మికుడు చిట్టా రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని శాంతినగర్​కు చెందిన రామకృష్ణ.. మగ్గం కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో పనిచేయలేక ఇంట్లోనే ఉంటున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా సరైన వైద్యం చేయించుకోలేకపోయాడు.

ఈ క్రమంలో  ఇంటి నుంచి బయటకు వెళ్లి రైల్వే గేట్​ వద్ద షెడ్డులో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

Also Read :

నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

బిగ్ బాస్ 4 తెలుగు : అరియానాపై విరుచుకుపడ్డ అవినాష్, ఆగం ఆగం అవుతున్నావ్ ఎందుకు బాస్ !