AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్ ఆదేశాలు.. ఫైన్ లేకుండానే వాహనాలకు విముక్తి..!

ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వాహనాలకు విముక్తి కలిగింది. అపరాధ రుసుము లేకుండానే వాహన యజమానులకు వాహనాలను ఇచ్చేస్తున్నారు పోలీసులు.

సీఎం జగన్ ఆదేశాలు.. ఫైన్ లేకుండానే వాహనాలకు విముక్తి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 24, 2020 | 7:32 PM

Share

ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వాహనాలకు విముక్తి కలిగింది. అపరాధ రుసుము లేకుండానే వాహన యజమానులకు వాహనాలను ఇచ్చేస్తున్నారు పోలీసులు. అయితే తిరిగి తప్పు చేయకుండా వాహనదారుల నుంచి బాండ్స్ రూపంలో పూచికత్తు తీసుకున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద మాత్రం సీజ్ చేసిన వాహనాలకు నామమాత్రపు ఫెనాల్టీని వసూలు చేశారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఇవాళ వాహనాలు విడుదల చేస్తున్నారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌ల వద్ద భౌతిక దూరం పాటిస్తూ వాహనాలను తీసుకుంటున్నారు యజమానులు.

ఈ సందర్భంగా వాహనాదారులు మాట్లాడుతూ.. ఫైన్ లేకుండా వాహనాలు ఇచ్చేయటం ఆనందంగా ఉందని అంటున్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. కంటైన్మెంట్ జోన్ లలో నిబంధనలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. విజయవాడలోని కంటైన్‌మెంట్ జోన్లలో తప్ప మిగిలిన అన్ని చోట్ల దుకాణాలు తెరుచుకోవచ్చునని.. కంటైన్‌మెంట్ జోన్లు లేని చోట కొత్త కరోనా కేసులు వస్తే ఆంక్షలు విధిస్తామని అన్నారు. రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం ఏడుగంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని అన్నారు. ఇక రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఇంటి వద్దే జరుపుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన  వాహనదారులను నుంచి కేవలం రూ. 100 జరిమాన వసూలు చేస్తే సరిపోతుందని, అయితే మరోసారి నిబంధనలను ఉల్లంఘించబోమంటూ వారి నుంచి స్వీయ హమీ పత్రాన్ని తీసుకోవాలని పోలీసు శాఖకు జగన్ సూచించిన విషయం తెలిసిందే.

Read This Story Also: Breaking: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు..!