AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కంపెనీ డైరెక్టర్లు పాస్‌పోర్ట్ సమర్పించాలని ధర్మాసనం చెప్పింది.

Breaking: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 24, 2020 | 7:16 PM

Share

వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కంపెనీ డైరెక్టర్లు పాస్‌పోర్ట్ సమర్పించాలని ధర్మాసనం చెప్పింది. అంతేకాదు తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక లాక్‌డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. అలా చెప్పని పరిస్థితుల్లో ఏటిఆర్ ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎల్జీ పరిసరాలను సీజ్ చేయాలని, కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరిని ఆ పరిసరాల్లోకి అనుమతించొందన్న హైకోర్టు స్పష్టం చేసింది. అయితే గ్యాస్ దుర్ఘటనపై దర్యాప్తు జరుపుతున్న కమిటీలు మాత్రం ఆ పరిసరాలలోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. ఇక వారు ఏం పరిశీలించారో అవన్నీ రికార్డు బుక్లో పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రమాదం జరిగిన తరువాత స్టైరిన్ గ్యాస్‌ని తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని ధర్మాసనం కోరింది. జనావాసాల మధ్య అంత ప్రమాదకరమైన గ్యాస్‌ని ఎలా స్టోర్ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. అంతేకాదు అక్కడి సమీప గ్రామాల ప్రజల్లో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదు.

Read This Story Also: అమితాబ్‌ లుక్‌కు ఆ జర్నలిస్ట్ ఫొటోనే ఇన్ఫిరేషనా..!