AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్నబియ్యానికి అర్హుల జాబితా..మీకార్డు చూసుకోండిలా..

రేషన్‌ కార్డుల ద్వారా ప్రజలకు సన్నబియ్యాన్ని అందజేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆదిశగా కార్యాచరణ అమలుచేస్తున్నారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో పథకం ప్రారంభించారు. అర్హులందరికీ నాణ్యమైన బియ్యాన్ని అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ప్రత్యేకించి బియ్యం కార్డులను అందజేయనుంది. ఈ మేరకు అర్హుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో సంబంధిత లిస్ట్‌ అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో […]

సన్నబియ్యానికి అర్హుల జాబితా..మీకార్డు చూసుకోండిలా..
Anil kumar poka
|

Updated on: Dec 20, 2019 | 1:30 PM

Share

రేషన్‌ కార్డుల ద్వారా ప్రజలకు సన్నబియ్యాన్ని అందజేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆదిశగా కార్యాచరణ అమలుచేస్తున్నారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో పథకం ప్రారంభించారు. అర్హులందరికీ నాణ్యమైన బియ్యాన్ని అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ప్రత్యేకించి బియ్యం కార్డులను అందజేయనుంది. ఈ మేరకు అర్హుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో సంబంధిత లిస్ట్‌ అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న తెల్ల రేషన్‌కార్డులతో పాటు అర్హత ఉండి కార్డులేని వారికి ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు జారీ చేస్తోంది. వీటిని జనవరిలో అందచేయనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే, కొత్తగా అందజేయనున్న బియ్యంకార్డులకు కావాల్సిన అర్హతలు గమనిస్తే..మూడెకరాల మాగాణి లేదా 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికి, లేదా రెండూ కలిపి పదెకరాల్లోపు ఉన్న వారు కొత్త బియ్యంకార్డులకు అర్హులుగా గుర్తిస్తున్నారు. ఇకపోతే, 300 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగదారులు సైతం కొత్తకార్డులకు అర్హులుగా గుర్తించారు. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రభుత్వం బియ్యంకార్డులను అందజేయనుంది. ఇక కొత్తకార్డుల ప్రింటింగ్‌ కోసం నాలుగు రోజుల్లో టెండర్లు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు అన్ని అర్హతలు ఉండి, జాబితాలో పేరు లేని వారు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

Follow Us
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?