AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందిః నారాలోకేష్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన తుగ్లక్ పాలన నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన నారాలోకేష్.. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….తుగ్లక్ పరిపాలన గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నామని.. ఇప్పుడు ప్రత్యక్షంగా తుగ్లక్ పరిపాలన చూస్తున్నామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు లాఠీలతో కొట్టిస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇంటి […]

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందిః నారాలోకేష్‌
Anil kumar poka
|

Updated on: Sep 04, 2019 | 1:50 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన తుగ్లక్ పాలన నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన నారాలోకేష్.. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….తుగ్లక్ పరిపాలన గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నామని.. ఇప్పుడు ప్రత్యక్షంగా తుగ్లక్ పరిపాలన చూస్తున్నామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు లాఠీలతో కొట్టిస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇంటి వద్ద కనిపించని 144 సెక్షన్..సీఎం జగన్‌ ఇంటి వద్ద ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రజల పన్నుల డబ్బును వైసీపీ కార్యకర్తలకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవటం మానేసిన ప్రభుత్వం..టీడీపీపై దాడులకు పాల్పడుతోందన్నారు నారా లోకేష్‌ లోకేష్‌ పర్యటన సందర్బంగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.