AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీవి రాజకీయ విమర్శలు.. మావి వ్యక్తిగత విమర్శలా..? ‘కత్తి’ కౌంటర్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ విద్యావిధానంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాతృభాషకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నాడంటూ వారు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించిన జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందుకు విమర్శలు చేస్తున్న వారు.. వారి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారని చురకలంటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ ముగ్గురి పేర్లు చెప్పిన జగన్… వారికి స్ట్రాంగ్ […]

మీవి రాజకీయ విమర్శలు.. మావి వ్యక్తిగత విమర్శలా..? 'కత్తి' కౌంటర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 12, 2019 | 7:58 AM

Share

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ విద్యావిధానంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాతృభాషకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నాడంటూ వారు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించిన జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందుకు విమర్శలు చేస్తున్న వారు.. వారి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారని చురకలంటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ ముగ్గురి పేర్లు చెప్పిన జగన్… వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు జగన్‌పై కామెంట్లు చేయగా.. మరోవైపు వైసీపీ అభిమానులు కూడా వారికి అంతే కౌంటర్ ఇస్తున్నారు. ఇలా రెండు పార్టీల అభిమానుల దూషణలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ‘జనసైనికులు సంయమనం పాటించండి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇక ఈ కామెంట్లకు సినీ క్రిటిక్ కత్తి మహేష్, మరింత అగ్గి రాజేశారు. పవన్‌పైనా, నాదెండ్ల మనోహర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వ్యక్తిగత విమర్శలేమిట్రా మనోహర్! పెళ్లాల సంఖ్య గుప్తమా లేక పిల్లలు ఎందరో తెలియకపోవడం తట్టుకోలేని తికమకా? అయినా ఒరేయ్! జగన్ ని ఆర్ధిక ఉగ్రవాది అన్నప్పుడు. జగన్ రెడ్డి…రెడ్డి అని కులాన్ని ఒత్తి ఒత్తి సాడిస్టిక్ ఆనందం పొందినప్పుడు. కడప రౌడీలు అని మాటిమాటికీ వాగినప్పుడు. కోడికత్తి అని వెక్కిరించిన్నప్పుడు. కోర్టుకెళ్లే నేరస్తుడు అని కూసినప్పుడు. అవన్నీ వ్యక్తిగతం కాదా? మీరు అంటే రాజకీయ విమర్శ…మేము అంటే వ్యక్తిగత విమర్శ. అంతేగా…సరే కానీ.. నాలుగో భార్య నాదేండ్లని మర్చిపోయినందుకు జగన్ గారు క్షమాపణలు చెప్పాలి కాబోలు!” అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. కాగా జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారు.

https://www.facebook.com/mahesh.kathi/posts/10157836749071115