AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి.జిల్లాలో రెండు వేరువేరు ఘటనలలో రూ.72.25 లక్షల దొంగ నోట్లను పోలిసులు పట్టుకున్నారు. మెళియాపుట్టి మండలం పట్టుపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని..

AP News: అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!
Representative Image
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Dec 14, 2024 | 12:40 PM

Share

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చేసే ముఠాల గుట్టును రట్టు చేశారు పోలిసులు. రెండు వేరువేరు ఘటనలలో భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు. జిల్లాలోని మెలియాపుట్టి, జి.సిగడాం పోలీస్ స్టేషన్లు పరిధిలో మొత్తం రూ. 72.25 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం నకిలీ కరెన్సీ చలామణియే కాకుండా వాటి ముద్రణకు కూడా తెరలేపారు దుండగలు. జిల్లాలోని మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామంలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని ఇంటిలో నకిలీ కరెన్సీ నోట్లు తయారికి పూనుకున్నారు.

మొదట మెళియాపుట్టి ఎస్‌ఐ నకిలీ కరెన్సీకి సంబంధించి ఉన్న ముందస్తు సమాచారంతో తన సిబ్బందితో పట్టుపురం జంక్షన్ వద్ద సంతలక్ష్మీపురం గ్రామంకి చెందిన ఏ-1 అయిన తమ్మిరెడ్డి రవిని పట్టుకొని విచారించారు. ఆ తర్వాత అతడి దగ్గర ఉన్న నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమ్మిరెడ్డిని విచారించగా మెలియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ఐదుగురు వ్యక్తులతో కలిసి దొంగనోట్లను ముద్రించారని తేలింది. దీంతో ఆ ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి రూ. 57.25 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీతో పాటు దొంగ నోట్ల తయారీకి ఉపయోగించిన మిషనరీ, ఇతర సామగ్రీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ తయారీని నిందితులు యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు. ముద్దాయిలు రూ. 5 లక్షల నిజమైన కరెన్సీ నోట్లు కి బదులుగా రూ.25 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను ఇస్తామని ఎర చూపి మోసగించటం వీరి నైజం. ఒరిస్సా నుండి నకిలీ నోట్లు తెచ్చి వాటిని కలర్ జిరాక్స్ మిషిన్‌లో జిరాక్స్ తీసి ఎదుటి వారిని బురిడీ కొడుతున్నారు ఈ నిందితులు.

ఇక జిల్లాలో మరో ఘటనకు సంభందించి జి. సిగడాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు రూ. 15లక్షల నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారు. జి. సిగడాం SI మధు …పెనసాo జంక్షన్ వద్ద ముందస్తు సమాచారంతో తనిఖీ నిర్వహించగాచగా పల్సర్ బైక్ పై వెళుతోన్న ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. వారి వద్ద నుండి 15 లక్షల రూపాయలు అనగా 500 రూపాయలు 30 కట్లు మరియు మూడు కట్ల బ్లాక్ మనీ అందులో దొరికాయి.ఆ కేసులో కొత్తదిబ్బలపాలెం గ్రామం, ఎచ్చెర్ల మండలంకి చెందిన గనగల్ల రవి A1 కాగా.. A2 – లావేరుకి చెందిన రాజేష్. . తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించవలని ఉద్దేశంతో దొంగ నోట్లు వ్యాపారం మొదలు పెట్టారు. చివరకు ఇలా కటకటాల పాలయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే