AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bapatla District: అక్కడ మట్టి తవ్వుతుంటే బయటపడింది చూసి అందరూ షాక్

తవ్వకాలు జరుపుతుండగా నిధి.. నిక్షేపాలు.. పురాతన వస్తువులు బయటపడటం మీరు చూసుంటారు. కానీ వేల ఏళ్ల నాటి సమాధాలు బయటపడటం మీరెప్పుడైనా చూశారా..? తాజాగా బాపట్ల జిల్లా అద్దంకి మండలం అలాంటి ఘటనే జరిగింది. దీంతో ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారు అధికారులు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Bapatla District: అక్కడ మట్టి తవ్వుతుంటే బయటపడింది చూసి అందరూ షాక్
Old Graves
Fairoz Baig
| Edited By: |

Updated on: Jan 22, 2025 | 8:46 AM

Share

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ సమీపంలో మట్టి తరలించేందుకు తవ్వకాలు జరుపుతుండగా పురాతన సమాధులు వెలుగులోకి వచ్చాయి… ఇవి క్రీస్తు పూర్వం 10 శతాబ్దం నుంచి 5వ శతాబ్దానికి చెందిన మనుషుల సమాధులుగా గుర్తించారు… 2,500 ఏళ్లనాటి సమాధాలు అని చారిత్రక పరిశోధకులు పరిశీలించి ధృవీకరించారు… అలాగే జె. పంగులూరు మండలం రామకూరు, సంతమాగులూరు మండం ఏల్లూరుల్లో కూడా ఇదే కాలం నాటి సమాధాలు ఇటీవల గుర్తించారు.

దాదాపు రెండు వేల ఐదువందల ఏళ్ల నాడు అనాటి సమాజంలోని మనుషులు చనిపోతే ఊరికి దూరంగా కొండ ప్రాంతాల్లో పూడ్చిపెట్టేవారు… జంతువులు సమాధులను తవ్వకుండా ఉండేందుకు వాటిపై పెద్ద పెద్ద రాళ్ళు ఉంచేవారు… ఈ సమాధి పొడవు 7 అడుగులు, వెడల్పు 4 అడుగులు, లోతు మరో 4 అడుగులు ఉండేలా ఏర్పాటు చేసినట్టు తాజాగా ధేనువకొండ సమీపంలో వెలుగులోకి వచ్చిన సమాధుల ద్వారా తెలిసింది… సమాధిలో మృతదేహంతో పాటు మట్టికుండ ఉంచి అందులో ఆహారపదార్ధాలు ఉంచారు… సమాధికి మూడు వైపులా రాళ్లు ఉంచి, పైన పొడవైన రాయి పరిచారు… సమాధిపై భాగం చుట్టూ గుండ్రంగా రాళ్లు పేర్చారు… ఇది ఆనాటి ఆచారంగా ఉండేదని భావిస్తున్నారు… దీంతో ఆనాటి ప్రజలు వ్యవసాయం చేయడమేకాకుండా నాగరిత కలిగిన సమాజంలో ఉన్నట్టు తెలుస్తోందని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. సమాధుల్లో ఉంచిన మట్టికుండల ఆనవాళ్ళపై నగిషీలు చెక్కి ఉండటంతో కళలు కూడా వికసించి ఉండేవని అంటున్నారు…

దేనువకొండ సమీపంలో మట్టి తవ్వుతుండగా వెలుగులోకి వచ్చిన ప్రాచీన సమాధులు తవ్వకాల్లో ఆనవాళ్లు కోల్పోయినట్టు గుర్తించారు… ఈ ప్రాంతాన్ని అద్దంకి తహసీల్దార్‌ తహసీ సింగయ్య, చారిత్రక పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి పరిశీలించారు… ఈ ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు చేపట్టరాదని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్