AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ విద్యార్థి కాల్చివేత.. దుండగుని లొంగుబాటు

అమెరికాలో భారతీయ విద్యార్ధి అభిషేక్ సుధీర్ భట్ ను కాల్చి చంపిన దుండగుడు ఎరిక్ టర్నర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆదివారం ఇతడ్ని శాన్ బెర్నార్డినో పోలీసులు అరెస్ట్ చేశారు. పాతికేళ్ల అభిషేక్ మైసూరుకు చెందిన వాడు. కాలిఫోర్నియాలో ఓ హోటల్ బయట ఈ యువకుడ్ని ఎరిక్ కాల్చి చంపాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినో లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిషేక్ ఈ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తమ కుమారుడు అమెరికాలో […]

భారతీయ విద్యార్థి కాల్చివేత.. దుండగుని లొంగుబాటు
Anil kumar poka
|

Updated on: Dec 02, 2019 | 11:52 AM

Share

అమెరికాలో భారతీయ విద్యార్ధి అభిషేక్ సుధీర్ భట్ ను కాల్చి చంపిన దుండగుడు ఎరిక్ టర్నర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆదివారం ఇతడ్ని శాన్ బెర్నార్డినో పోలీసులు అరెస్ట్ చేశారు. పాతికేళ్ల అభిషేక్ మైసూరుకు చెందిన వాడు. కాలిఫోర్నియాలో ఓ హోటల్ బయట ఈ యువకుడ్ని ఎరిక్ కాల్చి చంపాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినో లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిషేక్ ఈ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తమ కుమారుడు అమెరికాలో ఓ కిల్లర్ చేతిలో మరణించాడని తెలియగానే మైసూరులోని అతని తలిదండ్రులు కుప్పకూలిపోయారు. అతని కుటుంబం, స్నేహితులు ఫేస్ బుక్ లో ‘ గో-ఫండ్ మీ ‘ పేజీని ప్రత్యేకంగా  ఏర్పాటు చేయడంతో ఒక్కరోజే సుమారు 39 వేల డాలర్లు విరాళాలుగా అందాయి. ఎరిక్ టర్నర్ ను మంగళవారం పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. అభిషేక్ ను ఇతగాడు ఎందుకు కాల్చి చంపాడో తెలియలేదు.