AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అల్లా మాకు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్‌, ముషారఫ్‌లు వద్దు .. మోడీ కావాలంటున్న పాక్ పౌరుడు

పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే దాయాది దేశంలో అఖండ భారత్‌ మాట వినిపిస్తోంది. ఈ మాటలు చెబుతోంది ఎవరో కాదు..24 గంటలూ భారతీయులంటే పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే పాకిస్థానీయులే..

Viral Video: అల్లా మాకు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్‌, ముషారఫ్‌లు వద్దు .. మోడీ కావాలంటున్న పాక్ పౌరుడు
Pak Man Wants Modi
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2023 | 8:09 AM

ఇస్తాంబుల్‌ టు ఇస్లామాబాద్‌ మోదీ జిందాబాద్‌..ఇదీ ఇప్పుడు టర్కీ నుంచీ పాకిస్తాన్‌ వరకు వినిపిస్తున్న మాట.. మోదీ దౌత్యనీతిపై ప్రపంచ దేశాలే సాహో అంటున్నాయి. ఎప్పుడూ ఇండియాను ఆడిపోసుకునే పాక్‌ మీడియా కూడా మోదీని నెత్తిన పెట్టుకుంటోంది. పాకిస్తాన్‌ పౌరులు కూడా షరీఫ్‌లు, ఇమ్రాన్‌లు మాకొద్దేవద్దు..మోదీ మాత్రమే కావాలంటున్నారు. పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే దాయాది దేశంలో అఖండ భారత్‌ మాట వినిపిస్తోంది. ఈ మాటలు చెబుతోంది ఎవరో కాదు..24 గంటలూ భారతీయులంటే పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే పాకిస్థానీయులే..ఎందుకంటే..ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్‌ అతలాకుతలమవుతోంది.. పెరుగుతోన్న నిత్యావసర, ఇంధన ధరలు, రాయితీల్లో కోత వంటివి స్థానికుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం తెప్పిస్తున్నాయి..ఇదే టైమ్‌లో.. ఓ పాకిస్థాన్‌ పౌరుడు దేశ పరిస్థితులపై స్పందించిన తీరు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

పాక్‌ నుంచి ప్రాణాలతో పారిపోండి. భారత్‌లోకి అయినా సరే అనే నినాదాలు పాకిస్తాన్‌లో కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. అసలు పాక్ ను భారత్ నుంచి వేరు చేసి ఉండకూడదని.. తాను భావిస్తున్నట్లు చెప్పాడు ఆ పాక్ పౌరుడు.. అంతేకాదు భారత్ లోని ముస్లింలు తింటున్నట్లు.. తాము కూడా టొమాటోలను కేజీ రూ.  20, చికెన్ రూ. 150, పెట్రోల్‌ను లీటర్ 50 చొప్పున కొనుగోలు చేసుకునేవారమని అతను చెప్పిన వీడియో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మోడీ పాలనలో జీవించేందుకు తాము సిద్ధమేనంటున్నాడు. మోడీ గొప్ప వ్యక్తి అని..చెడ్డవాడు కాదని అంటున్నాడు. ఈ మాట ఒక్క పాకిస్థానీయులే కాదు.. ఇస్తాంబుల్‌ నుంచి ఇస్లామాబాద్‌ వరకు వినిపిస్తున్నమాట..ముస్లిం దేశాల్లో మోదీ ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. ప్రపంచంలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా మొదటగా మేమున్నామంటూ ముందుకొచ్చేది భారతదేశం అని అంటున్నారు.  అందుకే హిందూస్థాన్‌కు సలాం చేస్తున్నారు. పాకిస్థానీయులు కూడా మోదీనే కావాలంటున్నారు. అఖండ భారత్‌ నినాదాలకు బీజం వేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే