AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel advisory: భారత్ వెళ్లే పౌరులకు అమెరికా హెచ్చరిక.. ఆయా ప్రాంతాలకు వెళ్లొదంటూ..

భారత్‌కు వెళ్లే పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన కొత్త ట్రావెల్ అడ్వైజరీ సూచన మేరకు..

Travel advisory: భారత్ వెళ్లే పౌరులకు అమెరికా హెచ్చరిక.. ఆయా ప్రాంతాలకు వెళ్లొదంటూ..
Travel Advisory Us
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2022 | 9:41 AM

Share

భారత్‌కు వెళ్లే పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. భారతదేశానికి వెళ్లే అమెరికా పౌరులు తమ భద్రత గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన కొత్త ట్రావెల్ అడ్వైజరీ సూచన మేరకు.. భారత్‌లో అత్యాచార కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో లైంగిక హింస ప్రబలంగా ఉందని వెల్లడించింది. పర్యాటక కేంద్రాలు, షాపింగ్ మాల్స్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లే పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భారత్‌లో రైతుల నిరసనల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.  ముఖ్యంగా  ఉత్తర ఢిల్లీ సరిహద్దులు, పార్లమెంటు, రాజ్‌పథ్, జంతర్ మంతర్, ఇండియా గేట్ వంటి ప్రాంతాలు, జన్‌పథ్ వంటి ప్రాంతాలకు వెళ్లే మెట్రో రైళ్లలో ప్రయాణించొద్దని అమెరికన్లకు సూచనలు చేసింది.

అలాగే తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణనుంచి పశ్చిమ బెంగాల్ దాకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించే అమెరికా పౌరులకు ప్రభుత్వం అత్యవసర సర్వీసులు అందించే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ, ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి అమెరికా అధికారులు స్థానిక అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాలని కూడా ఆ అడ్వైజరీలో అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

అటు,ఇండో-పాక్ సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని అమెరికా పౌరులను కూడా హెచ్చరిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని అమెరికా పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ కూడా తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పాకిస్థాన్‌కు వెళ్లే వారికి సూచించింది. పాకిస్థాన్‌పై తీవ్రవాద కార్యకలాపాలను అమెరికా ఎత్తి చూపుతోంది. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ వంటి దేశాలు US ట్రావెల్ అడ్వైజరీలో నాలుగో స్థాయిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మెక్‌గ్రెగర్: అమెరికాలోని సెంట్రల్ టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది ప్రతీకార దాడిలో ఒకరు గాయపడినట్లు కూడా సమాచారం. దుండగుడు గాయపడ్డాడా అనేది స్పష్టంగా తెలియరాలేదు. అయితే దుండగుడిని పట్టుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు. దాడి వెనుక ఉద్దేశం అస్పష్టంగా ఉంది. బాధితురాలికి, దుండగుడికి మధ్య సంబంధం ఉందా అనే విషయంపై క్లారిటీ లేదు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాల్పులు జరిగిన నివాస ప్రాంతం భద్రతలో ఉందని టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ ఏజెన్సీ తెలిపింది. పబ్లిక్ సేఫ్టీ ఏజెన్సీ ప్రతినిధి సార్జెంట్ ర్యాన్ హోవార్డ్ ఐదుగురిని కాల్చి చంపారో లేదో ధృవీకరించడానికి నిరాకరించారు. చాలా మంది మరణానికి కారణం తెలియాల్సి ఉందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి