AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smuggling: నదిపై తేలియాడుతూ ప్లాస్టిక్‌ బాక్సులు.. స్వాధీనం చేసుకున్న బీఎస్‌ఎఫ్‌.. తెరిచి చూడగా లక్షలు విలువచేసే..

అక్టోబర్‌ 9న సాయంత్రం వేళ..అరటి బోదెలకు కట్టిన ప్లాస్టిక్‌ కంటైనర్లు పాగ్లా నదిలో బంగ్లాదేశ్‌ వైపు ప్రవహిస్తున్నాయి. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వీటిని గమనించారు. వెంటనే ఆ ప్లాస్టిక్‌ బాక్సులను ఒడ్డుకు తెచ్చి తెరిచి చూశారు.

Smuggling: నదిపై తేలియాడుతూ ప్లాస్టిక్‌ బాక్సులు.. స్వాధీనం చేసుకున్న బీఎస్‌ఎఫ్‌.. తెరిచి చూడగా లక్షలు విలువచేసే..
Pagla River
Jyothi Gadda
| Edited By: |

Updated on: Oct 10, 2022 | 4:06 PM

Share

అల‌ల‌పై తేలియాడూ నదిలో కొట్టుకొచ్చిన‌ ప్లాస్టిక్‌ బాక్సులను చూసి స్థానికులు కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అధికారుల ఆధ్వర్యంలో బాక్సులు స్వాధీనం చేసుకుని తెరిచి చూడగా, వాటిల్లో లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లు కనిపించాయి. జల రవాణా మార్గంలో ఇవి బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్లను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సరిహద్దులోని లోధియా అవుట్‌ పోస్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అక్టోబర్‌ 9న సాయంత్రం వేళ..అరటి బోదెలకు కట్టిన ప్లాస్టిక్‌ కంటైనర్లు పాగ్లా నదిలో బంగ్లాదేశ్‌ వైపు ప్రవహిస్తున్నాయి. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వీటిని గమనించారు. వెంటనే ఆ ప్లాస్టిక్‌ బాక్సులను ఒడ్డుకు తెచ్చి తెరిచి చూశారు. అందులో పలు కంపెనీలకు చెందిన 317 మొబైల్‌ ఫోన్లున్నాయి. పూర్తివివరాలు పరిశీలించగా..

పశ్చిమ బెంగాల్‌లోని ఇండో- బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన BSF సిబ్బంది వందలాది మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాగ్లా నది ఒడ్డున అరటి కాడలకు కట్టిన కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు నీటిలో తేలుతున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్లు వాటిని గమనించి వెంటనే వాటిని నదిలో నుంచి బయటకు తీశారు. ఈ కంటైనర్‌ను తెరిచి చూడగా అందులో 317 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మొత్తం మొబైల్స్ ధర దాదాపు రూ.38 లక్షలుగా చెబుతున్నారు.

దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌లోని 70వ బెటాలియన్ సిబ్బంది ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బోర్డర్ అవుట్ పోస్ట్ లోధియా (మాల్డా) సమీపంలోని పాగ్లా నదిలో కొన్ని ప్లాస్టిక్ కంటైనర్లు తేలుతున్నట్లు గుర్తించినట్లు BSF ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కంటైనర్లను అరటి కాండంతో కట్టి ఉంచారు. సైనికులు వాటిని చూడగానే వెంటనే నీటిలో నుండి బయటకు తీశారు. కంటైనర్‌లను బయటకు తీసి తెరిచి చూడగా, 317 ఫోన్‌లు కనిపించాయని, వీటి ధర దాదాపు రూ.38 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చట్టపరమైన చర్యల కోసం జవాన్లు ఈ మొబైల్ ఫోన్లను స్థానిక పోలీసులకు అప్పగించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు బీఎస్‌ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని 70వ బెటాలియన్ కమాండింగ్ అధికారి తెలిపారు. దీని వల్ల స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేసినట్టైందన్నారు. అధికారుల కళ్లుగప్పి అక్రమాలకు పాల్పడుతున్న కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. చట్ట ప్రకారం వారికి శిక్ష పడుతుందన్నారు.

ఇటీవల, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మయన్మార్, బంగ్లాదేశ్‌తో దేశ సరిహద్దుల నుండి డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలను కోరారు. నైజీరియా పౌరుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఆ ప్రాంతంలో ‘డ్రగ్ సిండికేట్’ కూడా పనిచేస్తోందని హోంమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూలం నుంచి గమ్యస్థానం వరకు సమగ్ర విచారణ జరగాలని, తద్వారా మొత్తం నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అక్రమ రవాణాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అదే సమయంలో బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us