Taliban Attack in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి.. 16మంది సైనికులు మృతి
ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి చేశాయి. గురువారం రాత్రి ఖాన్ అబాద్ జిల్లాలో తాలిబన్లు రక్తపుటేరులు పారించారు. భద్రతా దళాలనే లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు..
Taliban Attack in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి చేశాయి. గురువారం రాత్రి ఖాన్ అబాద్ జిల్లాలో తాలిబన్లు రక్తపుటేరులు పారించారు. భద్రతా దళాలనే లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు తప్పాయి అక్తర్ ఏరియాలో కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 16మంది సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు పరిస్థితిని సమీక్షించారు. దాడులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: