Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం.. ఇది ఎవరు చేశారన్నది సస్పెన్స్..

ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం జరిగిందని తెలింది. ఇది ఎవరు చేశారన్నది ఇంకా తేలయకున్నా.. కానీ..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం.. ఇది ఎవరు చేశారన్నది సస్పెన్స్..
Negotiators
Follow us

|

Updated on: Mar 29, 2022 | 2:23 PM

యుద్ధంలో అన్ని ఉంటాయి. ఒక్కసారి యుద్ధం వస్తే ఇక ఏం జరిగిన అంతే.. ఇప్పుడు జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్ మరో మలుపు తీసుకుంది. మాస్కో చరిత్రలో మరో విషప్రయోగం వెలుగు చూసింది. తాజాగా ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం జరిగిందని తెలింది. ఇది ఎవరు చేశారన్నది ఇంకా తేలయకున్నా.. కానీ, మార్చి 3వ తేదీన ఉక్రెయిన్‌-బెలారస్‌ సరిహద్దుల్లో జరిగిన చర్చల్లో ఈ విష ప్రయోగం జరిగిందనే కొత్త కథనం వెలుగులోకి వచ్చింది. రష్యా ఒలిగార్క్‌ రోమన్‌ అబ్రహమోవిచ్‌, ఉక్రెయిన్‌ ప్రతినిధిగా వచ్చిన ఆ దేశ పార్లమెంట్‌ డిప్యూటీ రుస్తెమ్‌ ఉమెరోవ్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చర్చల సమయంలో ఉక్రెయిన్‌ బృందం సభ్యుల కళ్లు ఎర్రగా మారిపోయి.. కొద్ది సేపు చూపు కూడా దెబ్బతింది. తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. ఈ విషయాన్ని ముందుగా వారు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక కథనంలో తెలిపారు.

ఈ ఘటన తర్వాత అబ్రహమోవిచ్‌, ఉమెరోవ్‌లు చికిత్స కోసం టర్కీలోని ఇస్తాంబుల్‌కు వెళ్లారు. వీరిపై ఏ రకం విషాన్ని ప్రయోగించారో ఇంకా గుర్తించలేదు. చర్చలకు ఇష్టపడని రష్యా అతివాదులే ఈ ప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయని బీబీసీ తన కథనంలో పేర్కొనడం విచిత్రం. రుస్తెమ్‌ ఉమెరోవ్‌ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. వాస్తవానికి ఈ ఆరోపణలు పెరిగితే శాంతిచర్చల మొత్తానికే బ్రేక్ పడే ఛాన్స్ అందని ఈ వార్తలకు తీవ్రత తగ్గించి చూపుతున్నట్లు భావిస్తున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత మరోసారి రష్యా-ఉక్రెయిన్‌ బృందాలు ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరపనున్నాయి.

34వ రోజు చేరిన రష్యా దాడులు

ఇదిలావుంటే.. ఉక్రెయిన్‌పై వరుసగా 34వ రోజు కూడా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మరియాపోల్‌ నగరాన్ని పూర్తిగా ఆక్రమించింది రష్యా. మరియాపోల్‌ పోరులో 5000 మంది సామాన్య పౌరులు చనిపోయినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారీ ఆయుధాలతో మరియాపోల్‌పై విరుచుకుపడ్డారు రష్యా సైనికులు. చెచెన్‌ దళాలు వాళ్లకు పూర్తిగా సహకరిస్తున్నాయి.

ఓవైపు యుద్ధం జరుగుతుండగానే మరోవైపు ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. టర్కీలో ఇరుదేశాల ప్రతినిధి బృందాలు చర్చలు జరుపుతున్నాయి. ఇరుదేశాల మధ్య చర్చలు జరగడం ఇది ఆరోసారి. అయితే చర్చల్లో ఎలాంటి పురోగతి కన్పించడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. తనతో పెట్టుకుంటే సర్వనాశనం అవుతావని హెచ్చరించారు.

ఉక్రెయిన్‌ లోని ప్రధాన నగరాలను ధ్వంసం చేస్తోంది రష్యా . యూరప్‌లో అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న ఖార్కీవ్‌ నగరం మొత్తం ధ్వంసమయ్యింది. నగరంలో ఎక్కడ చూసినా శిథిలాలే కన్పిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..

Latest Articles
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!