న్యూజిలాండ్ కాల్పులకు ప్రతీకారమే శ్రీలంక పేలుళ్లు: మంత్రి
న్యూజిలాండ్లోని క్రిస్ట్చర్చ్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు సంభవించినట్లు ఆ దేశ సహాయక రక్షణశాఖ మంత్రి రువన్ విజేవర్థనే అన్నారు. ‘‘క్రిస్ట్చర్చ్లో ముస్లింలపై జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు జరిగాయి. ప్రాథమిక విచారణలో ఇదే తేలింది’’ అని రువన్ ఆ దేశ పార్లమెంట్లో వెల్లడించారు. కాగా గత నెల 15న క్రిస్టిచర్చ్లో రెండు మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 50మంది మరణించగా.. వందల మంది గాయాలపాలైన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్లోని క్రిస్ట్చర్చ్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు సంభవించినట్లు ఆ దేశ సహాయక రక్షణశాఖ మంత్రి రువన్ విజేవర్థనే అన్నారు. ‘‘క్రిస్ట్చర్చ్లో ముస్లింలపై జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు జరిగాయి. ప్రాథమిక విచారణలో ఇదే తేలింది’’ అని రువన్ ఆ దేశ పార్లమెంట్లో వెల్లడించారు. కాగా గత నెల 15న క్రిస్టిచర్చ్లో రెండు మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 50మంది మరణించగా.. వందల మంది గాయాలపాలైన విషయం తెలిసిందే.