Terrorism: ఉగ్రవాదుల వార్నింగ్ తో..ప్రజలకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వలేని స్థితిలో పాకిస్తాన్!

Terrorism: పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి నిలిపివేసింది. ఈసారి మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేదు.

Terrorism: ఉగ్రవాదుల వార్నింగ్ తో..ప్రజలకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వలేని స్థితిలో పాకిస్తాన్!
Terrorism Stopped Polio Vaccine
Follow us

|

Updated on: Jun 18, 2021 | 1:42 PM

Terrorism: పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి నిలిపివేసింది. ఈసారి మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేదు. 2 లక్షల 70 వేల మంది కార్యకర్తలు ఈ టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత వారం ఉగ్రవాద దాడిలో ఇద్దరు కార్యకర్తలు మరణించారు. దీని తరువాత కూడా ఈ ఉద్యోగులకు చంపుతామనే బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాల దృష్ట్యా ప్రభుత్వం ఉగ్రవాదులకు లొంగి టీకా కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఈ పోలియో నిర్మూలన కార్యక్రమం ఇంతకు ముందు చాలాసార్లు ఇలానే రద్దు చేయడం జరిగింది.

ప్రభుత్వ వర్గాలు ఉగ్రవాద దాడుల ప్రమాదం ఎక్కువగా ఉందనే అభిప్రాయంలో ఉన్నాయి. అందుకే. ఈ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నారు. జాతీయ అత్యవసర ఆపరేషన్ సెంటర్ (ఇఓసి) గురువారం అన్ని జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పోలియో వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించరాదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

చాలా సన్నాహాల తరువాత, ఇమ్రాన్ ప్రభుత్వం మేలో పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. ఈసారి ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించే ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఉగ్రవాదులు అన్ని భద్రతా ఏర్పాట్లను ఛేదించారు. పోలియో టీకా కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఉగ్రవాదులు అడుగడుగునా వారిని బెదిరిస్తూ వచ్చారు. గత వారం ఇద్దరు పోలియో కార్మికులు హత్యకు గురయ్యారు. ఈ హత్యలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు రాజకీయ బలమైన ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని మర్దాన్ జిల్లాలో జరిగాయి.

‘డాన్ న్యూస్’ తో జరిగిన సంభాషణలో ఒక అధికారి మాట్లాడుతూ – పెషావర్, మర్దాన్లలో దాడుల తరువాత, టీకా డ్రైవ్‌లో పాల్గొన్న ప్రజలు భయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలున్నారు. వారిపై ఇక దాడులు జరగకూడదు. అందువల్ల, తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ఆపివేయాలని నిర్ణయించారు. పాకిస్తాన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్ కమల్ సిద్దిఖీ మాట్లాడుతూ – ”ఇది చాలా సిగ్గుచేటు. పాకిస్తాన్ ఇప్పటికీ పోలియోతో పోరాడుతోంది. పరిస్థితిని మెరుగుపరచడానికి బదులుగా, మేము మా ఆయుధాలను కొద్దిమంది ముందు ఉంచుతున్నాము. ఇంతకంటే సిగ్గుచేటు ఏమిటంటే, ఈ మత మౌలికవాదులతో వ్యవహరించడంలో ప్రభుత్వం కూడా విఫలమైంది.” అన్నారు.

దేశాన్ని పోలియో రహితంగా చేసే కార్యక్రమానికి అధిపతి రానా ముహమ్మద్ సఫ్దార్ చెబుతున్న దాని ప్రకారం, పోలియో కార్యకర్తలు కూడా కరోనా మహమ్మారి నివారణకు సంబంధించిన పనులు చేస్తున్నారు. వీటిలో 11 వేల మందిని గత ఏడాది మార్చిలో తొలగించారు.

2020 జనవరి 20 న విడుదల చేసిన డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మూడు దేశాలలో మాత్రమే పోలియో కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. పాకిస్తాన్ కాకుండా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియాలో పోలియో కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో సింధ్‌లో 21, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 22 మంది పోలియో రోగులు కనిపించారు. ఇవే కాకుండా పంజాబ్ ప్రావిన్స్‌లో పోలియో కేసులు వస్తున్నాయి. గిల్గిట్-బాల్టిస్తాన్ గణాంకాలు ఇంకా విడుదల కాలేదు.

Also Read: Smart Phone: స్మార్ట్ ఫోన్ కెమేరాతో చెడు బాక్టీరియాను గుర్తించవచ్చట.. అమెరికా సైంటిస్ట్స్ అద్భుత ఆవిష్కరణ!

Worlds Third Largest Diamond: ప్రపంచంలో అతి పెద్ద మూడో వజ్రం ఆఫ్రికా దేశాల్లో లభ్యం.. ఇది ఎన్ని క్యారెట్లుందో తెలుసా?