Omicron: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. తాజాగా ఆస్ట్రేలియాలో రెండు కేసులు గుర్తింపు.. 260 మంది ప్రయాణికులు ఐసోలేట్‌

New Variant Omicron: రెండేళ్ల క్రితం చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. రోజుకో రూపాన్ని సంతరించుకుంటూ ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతూనే ఉంది. తాజాగా కోవిడ్ 19 కొత్త వేరియంట్ ..

Omicron: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. తాజాగా ఆస్ట్రేలియాలో రెండు కేసులు గుర్తింపు.. 260 మంది ప్రయాణికులు ఐసోలేట్‌
New Variant Omicron
Follow us

|

Updated on: Nov 28, 2021 | 5:19 PM

New Variant Omicron: రెండేళ్ల క్రితం చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. రోజుకో రూపాన్ని సంతరించుకుంటూ ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతూనే ఉంది. తాజాగా కోవిడ్ 19 కొత్త వేరియంట్  ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ వివిధ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. దక్షిణాఫ్రికా  తర్వాత  బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయల్ , జర్మనీ దేశాల్లో అనంతరం బిటన్ దేశాల్లో బయటపడింది. అయితే ఇప్పుడు ఆ జాబితాలో ఆస్ట్రేలియాకూడా చేరింది. ఆస్ట్రేలియా ఒమిక్రాన్  కేసులను గుర్తించింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు.  ఒమిక్రాన్  వెలుగులోకి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ప్రయాణలపై ఆంక్షలు విధించడం ద్వారా తమను తాము రక్షించుకోవడానికి  ప్రయత్నించినప్పటికీ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని అధికారులు చెప్పారు.  సౌతాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా కి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ గుర్తించారు.

ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం న్యూ సౌత్ వేల్స్ లో శనివారం సాయంత్రం దక్షిణ ఆఫ్రికా నుండి సిడ్నీకి  వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా ఒమిక్రోన్ వేరియంట్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ఆరోగ్య అధికారులు చెప్పారు.  ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎటువంటి లక్షణాలు లేవని అంతేకాదు కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకున్నారని చెప్పారు.  ఇద్దరు ప్రయాణీకులకు స్పెషల్ గా చికిత్స నందిస్తున్నామని NSW హెల్త్ తెలిపింది. అంతేకాదు ఆస్ట్రేలియాలో.. అడుగు పెట్టిన దక్షిణాఫ్రికాకు చెందిన మరో 12 మంది ప్రయాణికులు కూడా 14 రోజుల హోటల్ క్వారంటైన్‌లో ఉండగా, దాదాపు 260 మంది ఇతర ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఐసోలేట్‌కి అధికారులు పంపారు.

దక్షిణాఫ్రికాలో బీ 1.1.529 కరోనా వేరియంట్ ను గుర్తించారు. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ కు ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టారు. ఇది ప్రమాదకరమైన వేరియంట్ గా వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. రోజు రోజుకీ వివిధ దేశాల్లో ఈ వేరియంట్ వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ వేరియంట్ ను గుర్తించిన దేశాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు యూరోపియన్ దేశాలతో పాటు జపాన్, సింగపూర్, ఇజ్రాయెల్ దేశాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మన దేశంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో పక్కాగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. అయితే అది ఒమిక్రాన్ అవునో కాదో తెలియాల్సి ఉందని అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read:   దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అరుదైన దృశ్యం.. ఒకచోట చేరి మాట్లాడుకున్న వైసిపి, టీడీపీ ఎంపీలు.