AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poveglia Island: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానక ద్వీపం.. 1,60,000 మందిని సజీవ దహనం చేశారు.

Poveglia Island: ఈ భూ ప్రపంచం అనేక రహస్యాలకు నెలవు. ఈ రహస్యాలలో ప్రజలకు తెలిసింది గోరంత మాత్రమే. ఇంకా తెలియాల్సింది కొండంత ఉంది. అయితే, తెలిసిన వాటిలో

Poveglia Island: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానక ద్వీపం.. 1,60,000 మందిని సజీవ దహనం చేశారు.
Iland
Shiva Prajapati
|

Updated on: Dec 05, 2021 | 6:25 AM

Share

Poveglia Island: ఈ భూ ప్రపంచం అనేక రహస్యాలకు నెలవు. ఈ రహస్యాలలో ప్రజలకు తెలిసింది గోరంత మాత్రమే. ఇంకా తెలియాల్సింది కొండంత ఉంది. అయితే, తెలిసిన వాటిలో ఇవాళ మనం ఓ రహస్య ద్వీపం గురించి చర్చించుకోబోతున్నాం. దానికి గురించిన వాస్తవాలు తెలిస్తే గూస్‌బమ్స్ రావడం ఖాయం. ఈ ద్వీపంలోని రహస్యం ఏంటి? అసలు దాని చరిత్ర ఏంటి? అంత ప్రత్యేకత ఏంటి? అక్కడికి ఎవరినీ అనుమతించరు ఎందుకు? వంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రహస్య ద్వీపం పేరు పోవెగ్లియా. ఇది ఇటలీ దేశంలో ఉంది. ఇది ఎల్లప్పుడూ రహస్యాలకు కేరాఫ్‌లా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ ద్వీపానికి వెళ్లిన వారు ఎవరు కూడా తిరిగిరాలేదని చెబుతుంటారు. అందుకే దీనిని రహస్య ద్వీపంగా పిలుస్తుంటారు. ఈ ద్వీపం ఇటాలియన్ నగరం వెనిస్, లిడో మధ్య వెనీషియన్ గల్ఫ్‌లో ఉంది. ఈ ద్వీపం రహస్యాన్ని బట్టబయలు చేసే ప్రయత్నంలో చాలా మంది అక్కడికి వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ తిరిగి రాలేకపోయారు. దాంతో అలర్ట్ అయిన ఇటలీ ప్రభుత్వం.. ఆ ద్వీపానికి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది. అప్పటి నుంచి ఈ ద్వీపానికి ఎవరూ వెళ్లటం లేదు.

వందల ఏళ్ల క్రితం ఇటలీలో ప్లేగు మహమ్మారి విపరీతంగా వ్యాపించిందట. ఆ సమయంలో దీనికి ఎటువంటి నివారణ లేదు. దాంతో ప్రభుత్వం తన ప్రజల గురించి తీవ్ర ఆందోళన చెందింది. ఈ వ్యాధి కారణంగా.. ప్రభుత్వం సుమారు 160,000 మంది రోగులను ఈ దీవికి తీసుకువచ్చి సజీవ దహనం చేసింది. కొంతకాలం తర్వాత దేశంలో బ్లాక్ ఫీవర్ అనే మరొక వ్యాధి చాలా వేగంగా వ్యాపించింది. ఈ బాధిత మృతదేహాలను కూడా అదే దీవిలో ఖననం చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుండి ఈ ద్వీపం శాపగ్రస్తమైందని స్థానికుల నమ్మకం. ఆ వ్యక్తుల ఆత్మలు నేటికీ ఇక్కడే తిరుగుతున్నాయని చెప్పుకుంటారు అక్కడి జనాలు. చాలా మంది ప్రజలు ఇక్కడ ఫాంటమ్ స్పిరిట్స్‌ని చూస్తున్నామని చెబుతుంటారు. దీంతో పాటు.. ఈ ద్వీపం నుండి తరచుగా వింత శబ్ధాలు వినిపిస్తాయని పేర్కొన్నారు. అయితే, ఇక్కడ జరుగుతున్న మిస్టరీ ఘటనల కారణంగా.. ఈ ద్వీపంలో ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అలా పొవెగ్లియా ద్వీపం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరుపొందింది.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?