AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్‌ దెబ్బకు మరింత కుదేలు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్‌.. గట్టెక్కేదెలా..?

ముప్పేట దాడితో పాకిస్తాన్‌కు ఊపిరాడనంత పనైంది. ఇప్పుడు యుద్ధం ఆగింది. కానీ, కొన్నాళ్ల పాటు ఓవైపు భారత్‌ వాయుసేన భీకరంగా విరుచుకుపడింది. మరోవైపు బెలూచిస్తాన్‌.. బెంబేలెత్తించింది. దీంతో.. ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌ పాతాళంలోకి కూరుకుపోతోంది. ఇప్పుడు మరో కొత్త సమస్య.. ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతోంది.

వార్‌ దెబ్బకు మరింత కుదేలు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్‌.. గట్టెక్కేదెలా..?
Pakistan Economy
Follow us
Balaraju Goud

|

Updated on: May 11, 2025 | 4:06 AM

ముప్పేట దాడితో పాకిస్తాన్‌కు ఊపిరాడనంత పనైంది. ఇప్పుడు యుద్ధం ఆగింది. కానీ, కొన్నాళ్ల పాటు ఓవైపు భారత్‌ వాయుసేన భీకరంగా విరుచుకుపడింది. మరోవైపు బెలూచిస్తాన్‌.. బెంబేలెత్తించింది. దీంతో.. ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌ పాతాళంలోకి కూరుకుపోతోంది. ఇప్పుడు మరో కొత్త సమస్య.. ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతోంది.

ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా భారత త్రివిధదళాలు జరుపుతున్న దాడులు.. పాకిస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే అప్పుల దేశంగా మారిపోయిన పాకిస్థాన్‌ను.. ఇప్పుడు చమురు సంక్షోభం వెంటాడుతోంది. చమురు నిల్వలు దాదాపు అడుగంటిపోవడంతో.. ఏం చేయాలో పాలుపోవడం లేదట. దీంతో, రాజధాని ఇస్లామాబాద్‌లో పెట్రోల్ బంకులను క్లోజ్ చేసేసింది. రాజధాని నగరంలోని అన్ని పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను రాబోయే 48 గంటల పాటు పూర్తిగా మూసివేయాలని తక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. యుద్ధవాతావరణంతోనే పాకిస్థాన్‌లో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది.

పాక్‌ క్యాపిటల్‌ ఇస్లామాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసి వేయడానికి గల కారణాలు ఏంటనే విషయంపై స్పష్టమైన వివరాలు తెలియకపోయినా.. భారత్‌తో పెట్టుకున్నందుకే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. భారత వైమానిక దాడులతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాక్‌కు.. ఇది మరో పెద్ద కష్టంగా కనిపిస్తోంది. ప్రధాన ఎయిర్‌బేస్‌లపై ఇండియన్ ఆర్మీ దాడులు చేయడంతో తప్పని పరిస్థితుల్లోనే.. పాక్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇది ఇస్లామాబాద్‌కే పరిమితమైతే ఓకే.. ఒక వేళ దేశ వ్యాప్తంగా ఇదే నిర్ణయం అమలు చేస్తే ఎలాగన్న భయం పాకిస్తానీలను వెంటాడుతోంది.

భారత సైన్యం జరిపిన దాడులతో.. పాక్‌ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని కోరుతూ.. పలు దేశాలను పాకిస్థాన్ ఆర్థిక సాయం కోరుతోంది. భారత్ ఆకస్మిక దాడులతో భారీ నష్టాలు వచ్చాయని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని ఏకరువు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. పాకిస్థాన్‌ వాణిజ్య కేంద్రంగా ఉన్న కరాచీ పోర్టుపై భారత నావికా దళం భీకర దాడి చేసింది. అరబ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు పాకిస్తాన్‌కు ఆ పోర్టే కీలక ఆధారం. అయితే, ఆ పోర్టుపైనే ఇండియన్‌ ఆర్మీ దాడి చేయడంతో… పాక్‌లో చమురు సంక్షోభం తలెత్తినట్టుగా తెలుస్తోంది.

ఆర్థికంగా దివాళా తీసిన పాక్‌కు.. ఇప్పడు ఐఎంఎఫ్‌ తీసుకున్న నిర్ణయం పెద్ద ఉపశమనాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ…100కోట్ల డాలర్ల రుణం తక్షణం ఆ దేశానికి ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ముందుకొచ్చింది. 100కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో 8వేల 540కోట్లు. అదే పాకిస్థాన్ కరెన్సీలో 28వేల కోట్లు. ఇప్పటికే భారత్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులు భారీగా కలిసొచ్చే అవకాశం ఉంది. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పాక్‌కు IMF ఫండ్స్ బిగ్ రిలీఫ్ ఇవ్వనున్నాయి.

సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌.. ఐఎంఎఫ్‌ ఇచ్చే నిధుల్ని కూడా భారత్‌పై ఉగ్రవాదుల్ని ఉసిగొల్పేందుకు, అమాయకుల్ని చంపేందుకే వాడుతుందని.. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. టర్కీ, చైనా నుంచి డ్రోన్లు, ఇతర ఆయుధాలు కొనుగోలు చేసి.. తమపై దాడి చేసేందుకే ఈ నిధులను పాక్ వినియోగిస్తుందని భారత్‌.. ఐఎంఎఫ్‌ బోర్డ్ మీటింగ్‌లోనే ఎండగట్టింది. దీనిపై ఐఎంఎఫ్‌లో శుక్రవారం జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉండి నిరసన తెలిపింది భారత్‌. పాకిస్తాన్‌కు నిధులు ఇవ్వాలనే IMF నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఐఎంఫ్ నుంచి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికే ఆర్థికంగా అతలాకుతలమవుతున్న పాక్‌కు.. ఐఎంఎఫ్‌ ఇచ్చే ఈ నిధులు హెల్పవుతాయా? అవి సరైన మార్గంలోనే ఉపయోగించబడతాయా? దీనివల్ల ఇండియాకు నష్టం జరుగుతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..