పాక్ ఉగ్రవాద నైజం మరోసారి బట్టబయలు.. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కర్ ఉగ్రవాదులు..!
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఈ కార్యక్రమంలో బహిరంగంగా పాల్గొనడమే ఇందుకు కారణం. జూన్ 24న కన్నుమూసిన షోయబ్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇస్లామాబాద్లోని H-8 స్మశానవాటికలో జరిగాయి.

పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఈ కార్యక్రమంలో బహిరంగంగా పాల్గొనడమే ఇందుకు కారణం. జూన్ 24న కన్నుమూసిన షోయబ్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇస్లామాబాద్లోని H-8 స్మశానవాటికలో జరిగాయి.
ముంబై 26/11 దాడులు, పహల్గామ్ మారణకాండ వంటి ఘోరమైన ఉగ్రదాడుల వెనుక ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా (LeT) కీలక నేతలు ఈ అంత్యక్రియలకు హాజరైనట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారతదేశానికి వ్యతిరేకంగా నిరంతరం విషం కక్కే లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. అంతర్జాతీయ నిషేధాల నుండి తప్పించుకోవడానికి లష్కర్ ఏర్పాటు చేసిన రాజకీయ విభాగం ‘పాకిస్తాన్ మార్కజీ ముస్లిం లీగ్’ (PMML) అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహమాన్ కూడా కసూరితో పాటు హాజరయ్యాడు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాది హఫీజ్ సయీద్కు చెందిన సంస్థలే ఈ PMML వెనుక ఉన్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారతదేశం ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించి, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ ఆపరేషన్లో మురిద్కేలోని లష్కర్ ప్రధాన కార్యాలయం ధ్వంసమవడంతో కసూరి తీవ్ర నిరాశలో ఉన్నాడు. సముద్ర మార్గం ద్వారా మరో 26/11 తరహా దాడి చేస్తామని, భూమి, గాలి, సముద్రంలో భారత్కు చోటు లేకుండా చేస్తామని అతడు ఇటీవల హెచ్చరించాడు. అలాగే, పాక్ సైన్యమే తమను అధికారిక కార్యక్రమాలకు, సైనికుల అంత్యక్రియల ప్రార్థనలకు పిలుస్తుందని చెబుతూ పాక్ ఆర్మీ-ఉగ్రవాదుల బంధాన్ని కసూరి స్వయంగా ఒప్పేసుకున్నాడు.
భారతదేశం గతంలో జరిపిన విధ్వంసకర దాడుల తర్వాత లష్కర్ వంటి సంస్థలు మళ్లీ పునర్నిర్మాణం చేసుకుంటున్నాయనే నిఘా వర్గాల సమాచారాన్ని ఈ పరిణామం బలపరుస్తోంది. ఒక అంతర్జాతీయ క్రికెటర్ కుటుంబ కార్యక్రమంలో ఇలాంటి కరడుగట్టిన ఉగ్రవాదులు యథేచ్ఛగా తిరగడం, పాకిస్తాన్లో ఉగ్రవాద శక్తులకు లభిస్తున్న నిరంతర ఆశ్రయాన్ని మరియు అధికారిక శ్రేణుల్లో వారికున్న ప్రభావాన్ని మరోసారి ప్రపంచ దేశాల ముందు బట్టబయలు చేసింది.
వీడియో ఇక్కడ చూడండి..
Lashkar-e-Taiba (LeT) terrorists openly attended Shoaib Akhtar’s brother Shahid Akhtar’s funeral. PMML’s Inam Rehman & other LeT terrorists were present…video officially released by LeT/PMML itself. Where are the ‘keep sports & terrorism separate’ champions now ? Your silence is… pic.twitter.com/vxSX6kYBVc
— Major Surendra Poonia (@MajorPoonia) June 26, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
