AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Palestine War: ఇజ్రాయిల్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఆపరేషన్ అజయ్.. యుద్ధంపై మంత్రి జై శంకర్‌తో మాట్లాడిన యూఏఈ మంత్రి

ఇజ్రాయిల్‌ నుండి తిరిగి రావాలనుకునే భారతీయులు తిరిగి మన దేశం వచ్చేందుకు వీలుగా ఆపరేషన్‌ అజయ్‌ని ప్రారంభించనుంది.  ఇందుకోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  విదేశాలలో ఉన్న మన జాతీయుల భద్రత , శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జై శంకర్ చెప్పారు.

Israel Palestine War: ఇజ్రాయిల్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఆపరేషన్ అజయ్.. యుద్ధంపై మంత్రి జై శంకర్‌తో మాట్లాడిన యూఏఈ మంత్రి
Operation Ajay
Surya Kala
|

Updated on: Oct 12, 2023 | 8:21 AM

Share

ఇజ్రాయిల్‌, హమాస్ ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాల్లోని ప్రజలు వందలాది మంది మరణిస్తున్నారు. వేలాదిమంది గాయపడుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉండడంతో భారతదేశం ఇజ్రాయిల్‌ నుండి భారతీయులను తిరిగి తీసుకువస్తుంది. ఇందుకోసం ఆపరేషన్‌ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. పౌరులను తిరిగి తీసుకురావడానికి చార్టర్ విమానాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఇజ్రాయిల్‌, హమాస్ మధ్య వరుసగా ఐదు రోజులుగా యుద్ధం జరుగుతోంది. గాజా వేదికగా హమాస్ యోధులు  ఇజ్రాయిల్‌పై తీవ్ర దాడులు చేస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్‌ ప్రతీకారం తీర్చుకుంటూ..  పాలస్తీనాపై నిరంతరం దాడులు చేస్తోంది. గాజాపై వైమానిక దాడితో పాటు, ఇజ్రాయెల్ సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయిల్‌ సైనికులు గాజా సరిహద్దులోకి ప్రవేశించారు. అటువంటి పరిస్థితిలో యుద్ధం చాలా రోజులు కొనసాగవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇజ్రాయిల్‌ నుండి తిరిగి రావాలనుకునే భారతీయులు తిరిగి మన దేశం వచ్చేందుకు వీలుగా ఆపరేషన్‌ అజయ్‌ని ప్రారంభించనుంది.  ఇందుకోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  విదేశాలలో ఉన్న మన జాతీయుల భద్రత , శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జై శంకర్ చెప్పారు.

యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడిన జై శంకర్

ఆపరేషన్ అజయ్‌ను ప్రకటించే ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభంపై చర్చించారు. జైశంకర్ తన యుఎఇ కౌంటర్‌తో ఫోన్‌లో ఈ సంభాషణ చేశారు. విశేషమేమిటంటే ఇజ్రాయిల్‌, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్‌తో చర్చలు జరిపిన తొలి అరబ్ దేశం యూఏఈ.

UAE విదేశాంగ మంత్రితో మాట్లాడిన జై శంకర్

ఇజ్రాయిల్‌లో 18 వేల మంది భారతీయ పౌరులు

ఒక నివేదిక ప్రకారం ఇజ్రాయిల్‌లో సుమారు 18 వేల మంది భారతీయ పౌరులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్న వారు.. అదే సమయంలో ఇజ్రాయిల్ లో భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. భారతదేశం తన పౌరులందరినీ ఇజ్రాయిల్‌ నుండి సురక్షితంగా తిరిగి తీసుకువస్తుందని, ఇందుకోసం చార్టర్ విమానాల ద్వారా ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ మంత్రి ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి