AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిఘాకు నూతన జవసత్వాలు… ఇజ్రాయిల్ నుంచి డ్రోన్లు, అమెరికా నుంచి మినీ డ్రోన్ల కొనుగోలు…

చైనా, పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ర‌క్షణ వ్యవస్థ తన బలాన్ని పెంచుకుంటోంది. సరిహద్దుల్లో దాయాది దేశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అన్ని విధాల సన్నద్ధం అవుతోంది.

నిఘాకు నూతన జవసత్వాలు... ఇజ్రాయిల్ నుంచి డ్రోన్లు, అమెరికా నుంచి మినీ డ్రోన్ల కొనుగోలు...
Drone
Rajeev Rayala
|

Updated on: Nov 26, 2020 | 2:58 PM

Share

చైనా, పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ర‌క్షణ వ్యవస్థ తన బలాన్ని పెంచుకుంటోంది. సరిహద్దుల్లో దాయాది దేశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అన్ని విధాల సన్నద్ధం అవుతోంది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నవంబర్ 25న బ్రహ్మోస్ క్షిప‌ణిని అండమాన్ నికోబార్ దీవుల నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ సూపర్ సోనిక్ మిసైల్ 300 కిలో మీటర్ల దూరంలోని ల‌క్ష్యాన్ని ఛేదించింది.

ప్రతీ కదలికపై కన్ను…

తాజాగా భారత ఆర్మీ చైనా సరిహద్దు వెంబడి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇజ్రాయిల్ నుంచి అధునాతన డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఈ డ్రోన్ల సాయంతో చైనా సరిహద్దు లద్దాఖ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రతీ కదలికను గమనించనుంది. అంతేకాకుండా అమెరికా నుంచి సైతం మినీ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. తద్వారా సరిహద్దు వెంబడి దురాక్రమణలను, చొరబాటులను, ముష్కరలను గుర్తించడం సులువవుతుందని, ఈ పరికరాల కొనుగోలు విలువ 500 కోట్లని ర‌క్షణ వర్గాలు తెలుపుతున్నాయి.

ధీటుగా బదులిచ్చేందుకే…

దేశీయ బ్రహ్మోస్ క్షిప‌ణిని ప్రయోగం, రష్యా నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికాల నుంచి డ్రోన్ల కొనుగోలు అంతా చైనా, పాకిస్తాన్లతో యుద్ధం వస్తే ధీటుగా బదులిచ్చేందుకే అని భారత ఆర్మీ అధికారులు అంటున్నారు. మొన్నటి చైనా దుశ్చర్యలో భారత జవాన్లను కోల్పోయిన అనంతరం ప్రధాని ర‌క్షణ రంగానికి అధిక నిధులు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం 30,500 కోట్ల నిధులతో క్షిప‌ణుల తయారీ, యుద్ధ విమానాల కొనుగోలు, నిఘా వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు.