Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ వస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఎందుకో తెలుసా?

అక్టోబరు 22-23 తేదీల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించిన కొద్ది రోజుల తర్వాత పుతిన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటనకు రానున్నట్లు రష్యా వర్గాలు తెలిపాయి.

భారత్ వస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఎందుకో తెలుసా?
Pm Modi , Vladimir Putin
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 19, 2024 | 8:49 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తున్నాయని, అయితే అది ఇంకా ఖరారు కాలేదని దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్‌ను కలిసినపుడు భారత్‌కు రావల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ పరిణామాన్ని ధృవీకరించారు. పుతిన్ భారత పర్యటన తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చివరిసారిగా డిసెంబర్ 6, 2021న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 21వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారతదేశాన్ని సందర్శించారు. కాగా, ఇప్పటి వరకు పుతిన్ పర్యటనపై మీడియాలో వచ్చిన కథనాలపై భారత్ అధికారికంగా స్పందించలేదు.

అక్టోబరు 22-23 తేదీల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించిన కొద్ది రోజుల తర్వాత పుతిన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటన రానుంది. రష్యా ఫెడరేషన్ అధ్యక్షతన కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. ఈ ఏడాది జులైలో ప్రధాని మోదీ మాస్కోను సందర్శించారు. 2024లో తొలిసారిగా ఆ దేశాన్ని సందర్శించారు. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది.

ఇదిలావుంటే, రష్యా మీడియా నివేదికల ప్రకారం, ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రోమ్ శాసనం ప్రకారం, కోర్టు స్థాపక ఒప్పందం, ICC సభ్యులు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు, అనుమానితులను నిర్బంధించడానికి బాధ్యత వహిస్తారు. అయితే, భారతదేశం రోమ్ శాసనంపై సంతకం చేయలేదు. ఆమోదించలేదు. అందుకే పుతిన్‌ భారత్‌ పర్యటనను ఎంచుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..