AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Market: చైనా ఇక మాకొద్దు బాబోయ్ అంటున్న మరో టెక్ దిగ్గజ సంస్థ.. డ్రాగన్ కంట్రీకి గుడ్ బై

China Market: డ్రాగన్ కంట్రీలో ఓ వైపు ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇపుడు మరో ప్రతికూల పరిస్థితిని..

China Market: చైనా ఇక మాకొద్దు బాబోయ్ అంటున్న మరో టెక్ దిగ్గజ సంస్థ.. డ్రాగన్ కంట్రీకి గుడ్ బై
Yahoo China
Surya Kala
|

Updated on: Nov 04, 2021 | 12:42 PM

Share

China Market: డ్రాగన్ కంట్రీలో ఓ వైపు ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇపుడు మరో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. చైనాలోని ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఒకొక్కటిగా విదేశీ టెక్ దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నాయి. విదేశీ సాంకేతిక సంస్థలు చైనా లో తమ కార్యకలాపాలను నిర్వహించలేమంటూ ఉపసంహరించు కుంటున్నాయి. ఫోర్ట్‌నైట్, యాహూ, లింక్డ్‌ఇన్ లతో సహా అనేక  ఇతరులు భారీ కంపెనీలు చైనా నుండి నిష్క్రమిస్తున్నాయి. తాము ఇక చైనాలో కార్యక్రమాలను నిర్వహించలేమని అక్కడ నెలకొన్న పరిస్థితులే కారణమని యాహు పేర్కొంది.

చైనాలో పనిచేస్తున్న పాశ్చాత్య కంపెనీలకు అనిశ్చితి ఏర్పడింది. చైనా అతి పెద్ద మార్కెట్‌ అయినప్పటికీ కొత్త చట్టం లోబడి పనిచేయాల్సి రావడం టెక్ కంపెనీలకు ముళ్ళమీద పనిచేస్తున్నట్లు ఉందని మార్కెట్ నిపుణుల వ్యాఖ్య. నిజానికి యాహూకి చెందిన చాల సర్వీసులను చైనా ఇప్పటికే నిలిపివేసింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో చైనా నుంచి యాహు తొలగింది. నవంబర్‌ 1 నుంచి మా సర్వీసులు అందుబాటులో ఉండవు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌  చైనా నుంచి తప్పుకుంది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్‌ సైతం తమ సైట్‌ను చైనాలో క్లోజ్ చేస్తున్నామని అక్టోబర్ లో తెలిపింది.  చైనాలోని

దేశీ దిగ్గజాలు సహా టెక్నాలజీ కంపెనీలపై నియంత్రణను ప్రభుత్వం ఇటీవలి కాలంలో మరింతగా పెంచుతోంది. ఈ పరిస్థితుల మధ్య చైనా నుంచి యాహూ నిష్క్రమించడం కేవలం లాంఛనంగా మాత్రమే మిగిలింది. ‘చైనాలో వ్యాపార నిర్వహణ, చట్టాల అమలుకు సంబంధించిన పరిస్థితులు కఠినతరంగా మారుతున్నాయి. తమ దేశలోని నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 50 మిలియన్ యువాన్లు ($7.8 మిలియన్లు) లేదా వారి వార్షిక ఆదాయంలో 5% వరకు జరిమానా విధిస్తున్నారు. ఇక సాంకేతికత, వాణిజ్యంపై అమెరికా – చైనా మధ్య జరుగుతున్నా గొడవలు కూడా ఈ పరిణామాలకు కారణమని తెలుస్తోంది.

Also Read: పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అయోధ్య.. త్వరలో రామమందిరం నిర్మాణం పూర్తి

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై