Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Coronavirus: చైనాలో కరోనా మరణ మృదంగం.. 30 రోజుల్లో 60 వేల మంది మృతి..

కరోనా విలయతాండానికి మహమ్మారి పుట్టినిళ్లు చైనా కుదైలైంది. మహమ్మారి దాటికి కేవలం 30 రోజుల్లోనే 60 వేల మంది చనిపోయారు. దేశంలో అమల్లో ఉన్న జీరో కోవిడ్‌ పాలసీని చైనా ప్రభుత్వం..

China Coronavirus: చైనాలో కరోనా మరణ మృదంగం.. 30 రోజుల్లో 60 వేల మంది మృతి..
China Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 15, 2023 | 9:18 PM

కరోనా విలయతాండానికి మహమ్మారి పుట్టినిళ్లు చైనా కుదైలైంది. మహమ్మారి దాటికి కేవలం 30 రోజుల్లోనే 60 వేల మంది చనిపోయారు. దేశంలో అమల్లో ఉన్న జీరో కోవిడ్‌ పాలసీని చైనా ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 8న ఎత్తివేయడంతో భారీసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్‌ 8 నుంచి జనవరి 12 వరకు 59 వేల 938 మంది కరోనాతో చనిపోయినట్లు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ చెప్పింది. ఇందులో 5వేల 503 మంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ.. శ్వాస సంబంధిత సమస్యలతో మృతిచెందారు. మరో 54 వేల 435 మంది వేరువేరు కారణాలతో చనిపోయారని తెలిపింది.

మృతి చెందినవారిలో 90 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారేనని NHC వెల్లడించింది. ఇక చైనాలో కరోనా విలయతాండవానికి అస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా ఉంటుదని చెప్పారు అధికారులు. డిసెంబర్‌ నాటికే 76 శాతం మంది వైరస్‌ బారిన పడగా.. ఈ నెలాఖరుకు బాధితుల సంఖ్య 92 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. జనవరి 22 నుంచి చైనాలో ప్రారంభమయ్యే న్యూ ఇయర్‌, స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ తో కరోనా కేసులు మరింత భారీగా పెరిగే అవకాశం ముఖ్య అధికారులు చెప్తున్నారు.

దీంతో వచ్చే 2, 3 నెలలు చైనాకు కఠిన రోజులుగా చెబుతున్నారు. ఈసమయంలో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే చైనాలో కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు పలు సూచనలు చేసింది. కరోనా మృతులకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించాలని డబ్ల్యూహెచ్ఓ చైనాను కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!
విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!
పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ
పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ
ఏసీని ఎంత ఎత్తులో అమరిస్తే మంచిది..? ఈ పొరపాట్లు చేయకండి!
ఏసీని ఎంత ఎత్తులో అమరిస్తే మంచిది..? ఈ పొరపాట్లు చేయకండి!
పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌..
పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌..
విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. ఫోటో వైరల్‌
విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. ఫోటో వైరల్‌
కన్నయ్య దర్శనం కోసం అనంత్ పాదయాత్ర.. ద్వారకాధీషుడి ఆలయ ప్రాముఖ్యత
కన్నయ్య దర్శనం కోసం అనంత్ పాదయాత్ర.. ద్వారకాధీషుడి ఆలయ ప్రాముఖ్యత
ఆయుధం లేకుండా చేతివేళ్లతో హత్య చేసే మర్మ కళ నేర్చుకున్న దుండగుడు
ఆయుధం లేకుండా చేతివేళ్లతో హత్య చేసే మర్మ కళ నేర్చుకున్న దుండగుడు