China: ఆ దేశానికి భయపడుతున్న చైనా.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని బలగాలకు పిలుపు..
కొవిడ్ కారణంగా కుదేలైన చైనా - పొరుగు దేశాలపై పట్టు బిగించేందుకు కత్తులు దూస్తోంది. ఆ కత్తులు పదును పెట్టేందుకు రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుకుంటూ పోతోంది.

కొవిడ్ కారణంగా కుదేలైన చైనా – పొరుగు దేశాలపై పట్టు బిగించేందుకు కత్తులు దూస్తోంది. ఆ కత్తులు పదును పెట్టేందుకు రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుకుంటూ పోతోంది. ఇందులో భాగంగానే తాజాగా తన రక్షణ బడ్జెట్ను భారీగా పెంచింది. గతేడాదితో పోల్చితే రక్షణ రంగానికి 7.2 శాతం ఎక్కువ కేటాయించాలని చైనా నిర్ణయించింది. చైనా కరెన్సీ యువాన్లో ఇది 1.56 ట్రిలియన్లు. డాలర్లలో చెప్పాలంటే ఇది 230 బిలియన్లు.
రక్షణ బడ్జెట్ను చైనా ఇలా పెంచుకుంటూ పోవడం ఇది ఎనిమిదోసారి. చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్ పెంపు అధికంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే పరిణామం. మరో వైపు యుద్ధం కోసం సిద్ధంగా ఉండాలని బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ చైనా ప్రధాని లీ క్వికియాంగ్ తమ బలగాలకు పిలుపునిచ్చారు.
తైవాన్ స్వాతంత్ర్యాన్ని మరింత దీటుగా వ్యతిరేకించాలని చైనా నిర్ణయించింది. తైవాన్లోనూ దృష్టిలో పెట్టుకొనే రక్షణ బడ్జెట్ను పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. తైవాన్లో అమెరికా దళాల కార్యకలాపాలు పెరుగుతున్నట్టు వస్తున్న సమాచారం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. తైవాన్ జలసంధిలో అమెరికా నౌకాదళం, అమెరికన్ ఎయిర్ఫోర్స్ గస్తీలు ముమ్మరం చేయడం చైనాను ఇబ్బంది పెడుతోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ గతేడాది ఆగస్టులో తైవాన్లో పర్యటించడం సంచలనం సృష్టించింది. నాన్సీ పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పర్యటన పూర్తైన వెంటనే తైవాన్ సమీపంలో భారీ యుద్ధ విన్యాసాలు చేపట్టింది చైనా.




ప్రపంచంలోనే అది పెద్ద పదాతి దళం చైనాది. తమ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు అందించడం, సరికొత్త యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇచ్చేందుకు చైనా తీవ్రంగా కృషిచేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..