AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్‌పై గరం… యాంటీ ట్రస్ట్ కేసు నయోదు చేసిన అమెరికా ప్రభుత్వం… 1 ట్రిలియన్ డాలర్ల జరిమానా డిమాండ్….

అమెరికా ప్రభుత్వం గూగుల్‌పై కేసు వేసింది. ఇంటర్నెట్ శోధన, ప్రకటనలలో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కాలిఫోర్నియా టెక్ దిగ్గజం అక్రమ గుత్తాధిపత్య ప్రవర్తనపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసింది.

గూగుల్‌పై గరం... యాంటీ ట్రస్ట్ కేసు నయోదు చేసిన అమెరికా ప్రభుత్వం... 1 ట్రిలియన్ డాలర్ల జరిమానా డిమాండ్....
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 13, 2020 | 5:27 PM

Share

అమెరికా ప్రభుత్వం గూగుల్‌పై కేసు వేసింది. ఇంటర్నెట్ శోధన, ప్రకటనలలో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కాలిఫోర్నియా టెక్ దిగ్గజం అక్రమ గుత్తాధిపత్య ప్రవర్తనపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసింది. దానికి కాలిఫోర్నియా అటర్నీ జనరల్ బహిరంగంగా మద్దతు ఇచ్చారు. గూగుల్‌పై 1 ట్రిలియన్ డాలర్ల జరిమానా వేయాలని డిమాండ్ చేశారు.

గూగుల్ ఇతర సంస్థల వ్యాపార పద్ధతుల్లో మార్పులను బలవంతం సూచిస్తోందని, అదే దావా వేసేందుకు ప్రధాన కారణంగా అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీర్ఘకాల బిగ్ టెక్ విమర్శకుడు, మిస్సౌరీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలీ, ఈ కేసు “ఒక తరంలో అతి ముఖ్యమైన యాంటీట్రస్ట్ దావా” అని అన్నారు. న్యాయ శాఖ చర్యను స్వాగతించారు.

పోటీని పక్కదారి పట్టిస్తోందని…

హోల్ఫాంగ్ సంస్థ ఆల్ఫాబెట్ ప్రధాన యూనిట్, గూగుల్ ప్రపంచంలో చాలావరకు ఉపయోగించే సెర్చ్ ఇంజిన్‌ను, మ్యాప్స్, ఇమెయిల్, ప్రకటనలు షాపింగ్ వంటి వివిధ రకాల సంబంధిత సేవలను నిర్వహిస్తుంది. ఈ సంస్థే ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా నిర్వహిస్తుంది. అయితే పోటీ సంస్థలను ఈ సిస్టం పక్కదారి పట్టిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌లో గూగుల్‌కు పెద్ద జరిమానాలు విధించబడ్డాయి అయితే గూగుల్ ఆ కేసులను సవాలు చేసింది. తమపై వచ్చిన గుత్తాధిపత్య దుర్వినియోగ వాదనలను కంపెనీ ఖండిస్తోంది.