AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్ తొలి ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూత.. చికిత్స పొందుతూ మృతి!

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్‌పీ చైర్‌పర్సన్ ఖలీదా జియా కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం 6 గంటలకు ఆమె మరణించారు. ఆమె దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 80 సంవత్సరాల వయసులో, ఖలీదా జియా ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

బంగ్లాదేశ్ తొలి ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూత.. చికిత్స పొందుతూ మృతి!
Bangladesh Fist Prime Minister Khaleda Zia
Balaraju Goud
|

Updated on: Dec 30, 2025 | 8:36 AM

Share

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్‌పీ చైర్‌పర్సన్ ఖలీదా జియా కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం 6 గంటలకు ఆమె మరణించారు. ఆమె దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 80 సంవత్సరాల వయసులో, ఖలీదా జియా ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

ఈ వార్తను బీఎన్‌పీ ఫేస్‌బుక్ పేజీ ధృవీకరించింది. ఆ పోస్ట్‌లో ” బీఎన్‌పీ చైర్‌పర్సన్, మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా మంగళవారం ఉదయం 6 గంటలకు, ఫజ్ర్ ప్రార్థనల తర్వాత మరణించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము” అని పేర్కొన్నారు.

ఖలీదా జియా కాలేయ సిర్రోసిస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి చాలా కాలంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్యులు ఆమెను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల ఆమెకు వెంటిలేటర్ కూడా పెట్టారు. ది డైలీ స్టార్ కథనం ప్రకారం, ఖలీదా జియా గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కారణంగా నవంబర్ 23న ఆసుపత్రిలో చేరారు. ఆమె గత 36 రోజులుగా చికిత్స పొందుతోంది. ఆమె న్యుమోనియాతో కూడా బాధపడుతోందని వైద్యులు తెలిపారు.

ఖలీదా జియా అంత్యక్రియల ప్రార్థనల తేదీని తరువాత ప్రకటిస్తామని పార్టీ తెలిపింది. వివరాలు ఇంకా విడుదల కాలేదు. ఆమె మృతికి పార్టీ తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించాలని కోరింది. ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ 17 సంవత్సరాలు లండన్ నుండి బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చిన కొద్ది రోజులకే ఆమె మరణించారు. 2008 నుండి స్వచ్ఛంద ప్రవాసంలో నివసిస్తున్నారు. తారిఖ్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని ఆసుపత్రిలో పరామర్శించారు. తారిఖ్ తిరిగి రావడాన్ని స్వాగతించడానికి పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాబోయే పార్లమెంటరీ ఎన్నికలకు ముందు బీఎన్‌పీకి ఇది ఒక కీలక పరిణామం.

ఖలీదా జియా ఎవరు?

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఆగస్టు 15, 1945న జన్మించారు. ఆమె బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు జియావుర్ రెహమాన్ భార్య. ఆమె భర్త జియావుర్ రెహమాన్ హత్య తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి బీఎన్‌పీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఖలీదా జియాపై అవినీతి ఆరోపణలు మోపబడ్డాయి. 2018లో ఆమెను జైలులో పెట్టారు. అయితే, ఆరోగ్య కారణాల వల్ల ఆమెను విడుదల చేశారు. అయితే, అప్పటి నుంచి ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు.

దేశ తొలి మహిళా ప్రధానమంత్రి

ఖలీదా జియా 1991 నుండి 1996 వరకు, మళ్ళీ 2001 నుండి 2006 వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె ఆ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. ఆమె బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ జియావుర్ రెహమాన్ భార్య. 1991 జాతీయ ఎన్నికలలో ప్రజల ఓటు ద్వారా ఖలీదా జియా అధికారంలోకి వచ్చారు. ఆమె పదవీకాలంలో, పార్లమెంటరీ వ్యవస్థ పునరుద్ధరించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. 2007లో సైనిక మద్దతుతో కూడిన ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ఖలీదా జియా షేక్ హసీనాతో సహా అనేక మంది రాజకీయ నాయకులు జైలు పాలయ్యారు. తరువాత జియా విడుదలై 2008 పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆమె పార్టీ గెలవలేకపోయింది. ఆమె కుటుంబంలో అతని పెద్ద కుమారుడు తారిఖ్, అతని భార్య, వారికి ఒక కుమార్తె ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..