Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఎదురుదెబ్బ… షేక్‌ హసీనా ఆస్తులు సీజ్‌కు ఢాకా కోర్టు ఆదేశం

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు కష్టాలు తప్పడం లేదు. దేశం విడిచి వచ్చినా ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. తాజాగా షసీనాకు ఢాకా కోర్టు షాకిచ్చింది. షేక్‌ హసీనా ఆస్తులు సీజ్‌ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నది. షేక్‌ హసీనాతో పాటు, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 124

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఎదురుదెబ్బ... షేక్‌ హసీనా ఆస్తులు సీజ్‌కు ఢాకా కోర్టు ఆదేశం
Sheikh Hasina
Follow us
K Sammaiah

|

Updated on: Mar 12, 2025 | 4:02 PM

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు కష్టాలు తప్పడం లేదు. దేశం విడిచి వచ్చినా ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. తాజాగా షసీనాకు ఢాకా కోర్టు షాకిచ్చింది. షేక్‌ హసీనా ఆస్తులు సీజ్‌ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నది. షేక్‌ హసీనాతో పాటు, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 124 బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గత ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగాయి. భారీగా హింస చోటుచేసుకుంది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె.. భారత్‌కు వచ్చేశారు. అనంతరం హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి రప్పించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. హసీనాను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్‌ ఉత్తరాల మీద ఉత్తరాలు పంపింది. ఈ నేపథ్యంలో ఢాకా కోర్టు హసీనా, ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది.

భారత్‌లో తలదాచుకుంటున్న షేక్‌ హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్‌ ప్రెస్‌ కార్యదర్శి షఫీకుల్‌ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్‌ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పార్టీలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’ అంటూ ఆయన ఆలం చెప్పారు.