AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై దాడి తరహాలో.. ఆస్ట్రియా రాజధానిలో వరుస కాల్పులు

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు దాడి చేశారు. ముంబై దాడి తరహాలు విరుచుకుపడ్డ ఉగ్రవాదులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు

ముంబై దాడి తరహాలో.. ఆస్ట్రియా రాజధానిలో వరుస కాల్పులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 03, 2020 | 7:07 AM

Share

Vienna terror attack: ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు దాడి చేశారు. ముంబై దాడి తరహాలు విరుచుకుపడ్డ ఉగ్రవాదులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. ఇక ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు సమాచారం. హిల్టన్ హోటల్‌లో టూరిస్టులను బందీలుగా చేసుకున్న టెర్రరిస్ట్‌లు.. మరికొన్ని ప్రాంతాల్లోనూ కాల్పులకు తెగబడినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న ఆస్ట్రియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్మీని రంగంలోకి దించింది. వియన్నా నగరం అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేసి రాజధానిని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Read More:

నేడే దుబ్బాక ‘దంగల్’..

నాలాల అభివృద్ధికి స్పెషల్ ప్రోగ్రాం…