Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban Rule: పంజ్‌షీర్ లోయలో తాలిబాన్ల మారణకాండ.. అమాయక పౌరులను వీధుల్లో చంపేస్తున్నారు!

ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ లోయలో తాలిబాన్ల నిరోధక దళం తాలిబన్లతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే, తాము పంజ్‌షీర్‌ను గెలిచినట్లు తాలిబాన్ ప్రకటించింది.

Taliban Rule: పంజ్‌షీర్ లోయలో తాలిబాన్ల మారణకాండ.. అమాయక పౌరులను వీధుల్లో చంపేస్తున్నారు!
Taliban Rule
Follow us
KVD Varma

|

Updated on: Sep 14, 2021 | 3:32 PM

Taliban Rule: ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ లోయలో తాలిబాన్ల నిరోధక దళం తాలిబన్లతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే, తాము పంజ్‌షీర్‌ను గెలిచినట్లు తాలిబాన్ ప్రకటించింది. మరోవైపు, రెసిస్టెన్స్ ఫోర్స్ ఇప్పటికీ 60% కంటే ఎక్కువ పంజ్‌షీర్‌లను కలిగి ఉన్నట్లు చెబుతోంది. తాలిబాన్లు ఇప్పుడు పంజ్‌షీర్‌లో పౌరుల రక్తం చిందిస్తున్నారు. ఇప్పటివరకు 20 మందిని దారుణంగా చంపేశారు. BBC నివేదిక ప్రకారం, తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్న 20 మందిలో ఒక దుకాణదారుడు కూడా ఉన్నాడు. తాలిబన్లు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి పారిపోలేదని, అతను పేద దుకాణదారుడని, యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని స్థానికులు చెబుతున్నారు. రెసిస్టెన్స్ ఫోర్స్ ఫైటర్‌లకు సిమ్‌లను విక్రయించినందుకు అతడిని తాలిబన్లు అరెస్టు చేసి, ఆపై హత్య చేసి మృతదేహాన్ని అతని ఇంట్లో ఉంచారు. శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని కూడా ప్రజలు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం, పంజ్‌షీర్ నించి ఒక వీడియో బయట పడింది. ఇందులో తాలిబానీలు ఒక యువకుడిని తన ఇంటి నుండి బయటకు విసిరేసి, రోడ్డుపై బుల్లెట్లు కాల్చుతున్నారు. అఫ్గాన్ న్యూస్ పోర్టల్ ప్రకారం, పంజ్‌షీర్‌లోని ఉత్తర కూటమి సైన్యంలో ఆ యువకుడు సభ్యుడని తాలిబన్లు చెప్పారు. అయితే, మరణించిన మరో సహచరుడు తన ఐడి కార్డును తాలిబన్లకు చూపిస్తూనే ఉన్నాడు. కానీ వారు అంగీకరించలేదు. అతని ప్రాణాలను తీసుకున్నారు.

ఇక తాలిబన్లు తాము మరిపోయామంటూ చెబుతున్న మాటలు ఇప్పటీకీ బూటకాలుగానే ఉన్నాయి. తాలిబన్ మారిందని ఒక మిలియన్ వాదనలు చేయవచ్చు. కానీ, వాస్తవం ఏమిటంటే ఇది 20 సంవత్సరాల క్రితం మాదిరిగానే ఇప్పటికీ మహిళల పట్ల క్రూరంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణ తర్వాత ప్రతిరోజూ దీనికి సంబంధించిన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. రాజధాని కాబూల్‌లో, తాలిబానీలు ఒక మహిళను కొట్టిన మరొక ఫోటో బయటపడింది. ఈ మహిళ కాబూల్‌లో ప్రదర్శనలో పాల్గొంది. తాలిబన్లు ఆమెను చుట్టుముట్టారు. కర్రలు.. కొరడాలతో దెబ్బల వర్షం కురిపించారు.

తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించకముందే, ఆఫ్ఘన్ మహిళలు తమ హక్కుల కోసం ప్రదర్శనలు ప్రారంభించారు. కానీ, తాలిబాన్లు వారిని తుపాకీతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాలిబానీ ప్రభుత్వంలో ఒక మహిళను చేర్చకుండా, వారిపై కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. ఇది మహిళల అసంతృప్తిని పెంచుతోంది. కానీ తాలిబన్లు కొన్నిసార్లు కాల్పులు జరిపి, కొన్నిసార్లు కొట్టడం ద్వారా వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. నిరసనకు ముందు అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఏ నినాదాలు చేయకూదదనీ ఇటీవల డిక్రీ కూడా జారీ చేశారు.

పాకిస్తాన్ తాలిబాన్లకు.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది : అమెరికా

పాకిస్తాన్ తాలిబాన్ సంబంధానికి సంబంధించి అమెరికా పెద్ద ప్రకటన చేసింది. తమ ప్రభుత్వంలో పాల్గొన్న తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంతో సమన్వయం చేసుకోవాలని బ్లింకెన్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై, రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌తో తన సంబంధాలను కూడా అమెరికా సమీక్షిస్తుందని ఆయన చెప్పారు. తాలిబాన్‌లతో పాకిస్థాన్‌కు అనేక ఆసక్తులు ఉన్నాయని, వాటిలో కొన్ని అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయని బ్లింకెన్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం జోక్యం చేసుకోవడం వల్ల పాకిస్తాన్ దెబ్బతినే చర్యను కొంతవరకు తగ్గించామని ఆయన అన్నారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI కి ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌తో లోతైన సంబంధాలు ఉన్నాయని బ్లింకెన్ చెప్పారు. అమెరికన్ సైనికుల మరణాలు, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ వంటి అనేక సంఘటనలకు హక్కానీ నెట్‌వర్క్ బాధ్యత వహిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Fact Check: అంతరిక్షంలో తిరుగుతున్న మిస్టరీ శాటిలైట్‌.. నాసా చెప్పిందేమిటంటే..!

Girlfriend: తాగుబోతులకు, తిరుగుబోతులకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకూ కావలి..వెదికి పెట్టమని ఎమ్మెల్యేకు ఓ యువకుడు లెటర్..