Peshawar: పెషావర్ ఆత్మాహుతి దాడిలో పెరుగుతున్న పెరుగుతున్న మృతులు.. ఇప్పటి వరకు 93 మృతదేహాలు గుర్తింపు..

పాకిస్తాన్ లోని పెషావర్ లో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 93 మంది మృతి చెందగా మరో 200 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది..

Peshawar: పెషావర్ ఆత్మాహుతి దాడిలో పెరుగుతున్న పెరుగుతున్న మృతులు.. ఇప్పటి వరకు 93 మృతదేహాలు గుర్తింపు..
Blast In Peshawar
Follow us

|

Updated on: Jan 31, 2023 | 3:20 PM

పాకిస్తాన్ లోని పెషావర్ లో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 93 మంది మృతి చెందగా మరో 200 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది.. శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్స్‌లోని ఓ మసీదులో సోమవారం మధ్యాహ్నం ఆత్మాహుతి దాడి జరిగింది. ఇప్పటికే 93 మంది చనిపోగా.. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు, అధికారులు చెబుతుండటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందకి. దాదాపు 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రముఠా నుంచి కూడా ప్రకటన వెలువడలేదు. పాకిస్తాన్ పరిరక్షణ కోసం పాటుపడుతోన్న వారిని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు భయాన్ని సృష్టించాలని అనుకుంటున్నారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్ కు.. ఇప్పుడు జరిగిన ఆత్మాహుతి దాడి ఘటన కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ దేశంలో పరిస్థితిని మరింత దిగజార్చింది.

సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు మసీదులో భద్రతా సిబ్బంది సహా మరికొందరు ప్రార్థనలు చేస్తున్న సమయంలో.. ముందు వరుసలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. పేలుడు ధాటికి మసీదులోని కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. అఫ్గానిస్థాన్‌లో గతేడాది ఆగస్టులో తమ కమాండర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఖురసానిని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు టీటీపీ ప్రకటించింది. 2007లో ఏర్పాటైన టీటీపీ కొన్నేళ్లుగా పాక్‌ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..