AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 23 మంది గల్లంతు

నేపాల్‌లోని ధడింగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. బెనిఘాట్ రోరంగ్ మున్సిపాలిటీ-3 పరిధిలోని త్రిశూలీ నదిలో అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయాలపాలయ్యారు. మరో 23 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ధడింగ్ జిల్లా పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు మలంగావ నుంచి […]

నదిలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 23 మంది గల్లంతు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 09, 2019 | 12:41 PM

Share

నేపాల్‌లోని ధడింగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. బెనిఘాట్ రోరంగ్ మున్సిపాలిటీ-3 పరిధిలోని త్రిశూలీ నదిలో అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయాలపాలయ్యారు. మరో 23 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ధడింగ్ జిల్లా పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు మలంగావ నుంచి ఖాట్మండ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.