బొగ్గు గనిలో పేలుడు.. 10 మంది మైనర్లు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..

ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. చనిపోయిన వారంతా మైనర్లుగా..

బొగ్గు గనిలో పేలుడు.. 10 మంది మైనర్లు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..
Coal Mine Explosion
Follow us

|

Updated on: Dec 09, 2022 | 9:58 PM

ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. చనిపోయిన వారంతా మైనర్లుగా తెలుస్తోంది. మిథేన్ గ్యాస్ లీక్ అవ్వటంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పది మంది మృతదేహాలను గుర్తించారు అధికారులు. మరో నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖనిజాలు అధికంగా ఉన్న ఆగ్నేయాసియా ద్వీపసమూహంలో మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రత్యేకించి సరైన భద్రతా పరికరాలను ఉపయోగించకుండా ఉండటమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో బోర్నియో ద్వీపంలో జరిగిన పేలుడు ఘటనలోనూ ఏడుగురు మృతి చెందారు. ఏప్రిల్ లోనూ ఉత్తర సమత్రా ఫ్రావిన్స్‌లో బంగారు గనిలో పేలుడు సంభవించి 12 మంది దుర్మరణం చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇద్దరిని రక్షించి.. తక్షణ చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. మైనింగ్​ జరుపుతుండగా మీథేన్ వాయువు పెద్దమొత్తంలో విడుదల అవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు.

బ్లోయర్ల సహాయంతో గని నుంచి మీథేన్​ను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో మొత్తం 14మంది కార్మికులు గనిలోపల ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..