Ancient idols: తమిళనాడులో కోట్ల విలువైన విగ్రహాలు లభ్యం.. విలువెంతో తెలిస్తే షాకే..!
తమిళనాడులో కోట్ల విలువ చేసే పురాతన పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విరుదునగర్ జిల్లా కారియాప్పట్టికి చెందిన బాలమురుగన్, పురాతన మాణిక్క వినాయగర్, మాణిక్కవాసగర్ విగ్రహాలను అక్రమంగా విక్రయించడానికి యత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విగ్రహాలను తాము కొనుగోలు చేస్తామని, వాటిని చెన్నైకి తీసుకురమ్మని పోలీసులు చెప్పారు.
తమిళనాడులో కోట్ల విలువ చేసే పురాతన పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విరుదునగర్ జిల్లా కారియాప్పట్టికి చెందిన బాలమురుగన్, పురాతన మాణిక్క వినాయగర్, మాణిక్కవాసగర్ విగ్రహాలను అక్రమంగా విక్రయించడానికి యత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విగ్రహాలను తాము కొనుగోలు చేస్తామని, వాటిని చెన్నైకి తీసుకురమ్మని పోలీసులు చెప్పారు. దాంతో బాలమురుగన్ పోలీసులు చెప్పిన చోటికి తన అనుచరులతో కలిసి వెళ్లాడు. విగ్రహాలు మఫ్టీలో ఉన్న పోలీసులకు ఇచ్చి, నగదు ఇవ్వమని అడిగారు. పోలీసులు వారు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో విగ్రహాలను తిరువణ్ణామలై నుంచి చోరీ చేసినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న రెండు విగ్రహాల విలువ 2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ విగ్రహాల వ్యవహారంతో సంబంధమున్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

