Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళులు.. తెలంగాణ అసెంబ్లీ ప్రతేక సమావేశాలు

మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 30, 2024 | 12:17 PM

తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయింది.. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సభ నివాళులు అర్పించింది.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం అయింది.. ఈ సందర్భంగా సభ్యులు మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలను గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని పోషించిన కీలక పాత్రను అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ గుర్తుచేసుకునే అవకాశం ఉంది.

మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యుల సూచన మేరకు అవసరమైతే మరో చోటకు మారుస్తామన్నారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కోరారు.

అందరికి ఆహార భద్రత చట్టం తీసుకువచ్చిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్‌కే దక్కుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉపాధి హామీ పథకం దేశంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందన్న భట్టి.. కరోనా సమయంలో ఉపాధి హామీ గ్రామీణులను ఆదుకుందని అన్నారు. భూమి లేని వారికి అటవీ హక్కుల చట్టం భరోసానిచ్చిందన్నారు భట్టి విక్రమార్క