Big News Big Debate: దేశవ్యాప్తంగా మళ్లీ సంక్షేమ పథకాలపై రచ్చ రచ్చ.. సుప్రీంకు చేరిన పంచాయతీ
మొత్తానికి పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల్లో ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండు విభిన్న అంశాలని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు దీనిపై విసృతంగా చర్చ జరగాలంటోంది. ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించే పథకాలు అవసరం. అదే సమయంలో పన్నులు చెల్లించేవారి డబ్బు అభివృద్ధికి వెచ్చించాల్సిన అవసరం ఉందన్నారు.

Big News Big Debate
దేశవ్యాప్తంగా మళ్లీ సంక్షేమ పథకాలపై రచ్చ రచ్చ జరుగుతోంది. అటు పార్టీల మధ్య మాటలయుద్ధం.. ఇటు సుప్రీంకోర్టులో వాదనలతో ఉచిత పథకాలపై చర్చ మొదలైంది. పేదలకు అందే సంక్షేమ పథకాలు రద్దు చేసే కుట్ర జరుగుతుందని రాష్ట్రాలు అంటే.. ఉచితం పేరుతో పంచే పథకాలు దేశ భవిష్యత్తును అంధకారం చేస్తాయంటున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఏది ఉచితం.. మరేది సంక్షేమం తేల్చడానికి కమిటీ వేయాలని సూచించిన సుప్రీంకోర్టు విసృత చర్చ జరగాలంటోంది.




