Viral Video: ట్రైన్‌లో జర్నీ చేసిన అడవి పంది.. పట్టుకునేందుకు వచ్చిన సిబ్బందికి ముప్పుతిప్పలు.!

అడవిలో ఉండాల్సిన జంతువులు నగరాల్లోకి వస్తున్నాయి. మనుషుల మధ్య తిరుగుతూ సందడి చేస్తున్నాయి. రైళ్ళల్లో కూడా ప్రయాణం చేస్తూ ....

Viral Video: ట్రైన్‌లో జర్నీ చేసిన అడవి పంది.. పట్టుకునేందుకు వచ్చిన సిబ్బందికి ముప్పుతిప్పలు.!
Pig
Follow us

|

Updated on: Jun 22, 2021 | 8:38 AM

అడవిలో ఉండాల్సిన జంతువులు నగరాల్లోకి వస్తున్నాయి. మనుషుల మధ్య తిరుగుతూ సందడి చేస్తున్నాయి. రైళ్ళల్లో కూడా ప్రయాణం చేస్తూ సోషల్‌ మీడియాలో కెక్కుతున్నాయి. ఇక వాటికి సంబంధించిన వైరల్‌ వీడియోలతో జనం ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. ఓ కోతి ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేసిన ఫన్నీ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ పిల్ల అడవి పంది హాంగ్‌కాంగ్‌లో సబ్‌వే రైలులో ప్రయాణం చేసింది. బుద్ధిగా సీటుపై కూర్చుని ట్రైన్ జర్నీని ఎంజాయ్‌ చేసింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది.

Also Read: Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

హాంగ్‌కాంగ్‌ సబ్‌వే ట్రైన్‌లో దర్శనమిచ్చిన ఈ పిల్ల అడవిపంది ఓ పది స్టేషన్ల తర్వాత మరో రైలు ఎక్కింది. విక్టోరియా హార్బర్‌ వైపు వెళుతున్న రెండో రైలులో పందిని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. వారిని పరుగులు పెట్టింది. అయితే చివరాఖరికి వ్యవసాయ, అటవీ, మత్స్యశాఖలకు చెందిన అధికారులు ఆ పందిని బంధించి అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు. పిల్ల పంది అల్లరి చిన్న పిల్లల చేష్టలా ఉన్నాయని ముచ్చటపడి నెటిజన్లు వీడియోను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. టికెట్‌ లేకుండా జర్నీ చేసిందంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:  రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!