Viral: అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లు.. రూ.100తో ఎన్ని కోట్ల జాక్పాట్ కొట్టారో తెలిస్తే షాకే!
లచ్చిందేవి... ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అందుకేనేమో కొన్నిసార్లు సామాన్యులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు.

దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటది.. కానీ అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. లచ్చిందేవి… ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అందుకేనేమో కొన్నిసార్లు సామాన్యులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ప్రదీప్, రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు కొద్దిరోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన తన బంధువును రిసీవ్ చేసుకునేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విషు బంపర్ లాటరీ టికెట్ ఒకటి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన లక్కీ డ్రా.. మే 15వ తేదీన తీయగా.. ఆ ఇద్దరికి ఊహించని రీతిలో జాక్పాట్ తగిలింది. రూ.100 లాటరీ టికెట్కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది. కాగా, వీరిద్దరూ ఆ లాటరీ డబ్బును అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి తీసుకున్నారు.