Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌ సీటు కింద నక్కిన రక్తపింజర.. 100 కిలోమీటర్లు జర్నీ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అయితే, అలా మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డకుల వద్దకు చేరుకోగానే..బైక్‌ ఆగిపోయింది.. ఏం జరిగిందో అర్థం కాక సమీపంలోని మెకానిక్‌ కు చూయించారు. బైక్‌లో ఏం సమస్య ఉందో గుర్తించేందుకు మెకానిక్‌ పరికరాలు విప్పుతుండగా పాము కనిపించింది. అదిన చూసిన వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు..దీంతో స్థానిక యువకులం తా కలిసి మోటర్‌ సైకి ల్‌ ఉన్న పామును బయటకు తీసేందుకు గంటకు పైగా శతవిధాలుగా ప్రయత్నం చేశారు.

Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 08, 2024 | 3:44 PM

టూవీలర్‌ బైకులో దూరిన ప్రాణాంతక రక్తపింజర హడలెత్తించింది. ఆ విషయం తెలియక బైక్‌పై బయల్దేరిన యువకులు.. మార్గ మధ్యలో బైక్‌ ఆగిపోవటంతో ఏంటని చూడగా ప్రాణాంతక పాము కంటపడింది.. దాంతో ఆ యువకులు భయంతో పరుగులు తీశారు.. ఈ షాకింగ్‌ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్‌లో ఓ పరిశ్రమలో పని చేస్తున్నా రు. అయితే ఇద్దరు కలిసి బైక్‌పై ఏపీలోని తాడిపర్తికి వెళ్లి సిమెంట్‌ పరిశ్రమలో మిషన్‌ ను మరమ్మతు చేసి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలో కర్నూల్‌ వద్ద బైక్‌లో పెట్రోల్‌ పోయించుకుని మళ్లీ బయల్దేరారు..

అయితే, అలా మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డకుల వద్దకు చేరుకోగానే..బైక్‌ ఆగిపోయింది.. ఏం జరిగిందో అర్థం కాక సమీపంలోని మెకానిక్‌ కు చూయించారు. బైక్‌లో ఏం సమస్య ఉందో గుర్తించేందుకు మెకానిక్‌ పరికరాలు విప్పుతుండగా పాము కనిపించింది. అదిన చూసిన వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు..దీంతో స్థానిక యువకులం తా కలిసి మోటర్‌ సైకి ల్‌ ఉన్న పామును బయటకు తీసేందుకు గంటకు పైగా శతవిధాలుగా ప్రయత్నం చేశారు.

అయితే అది రక్త పింజర అని గుర్తించారు. ఆ పాము కాటు వేస్తే ప్రాణహాని ఉండేదని, యువకులకు ఇంకా భూమి మీ ద నూకలు ఉన్నాయని, అందుకే వారు పాముతోపాటు సుమా రు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించినా వారిని పాము కాటు వేయలేదని అక్కడున్న వారు చర్చించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..