AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sinking City: మానవ స్వార్ధానికి కుంగిపోతున్న భూమి .. నగరం విడిచి వెళ్ళడానికి రెడీ అవుతున్న ప్రజలు

ఉత్తరాఖండ్‌లోని జోషి మఠం గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ భూమి క్షీణించిందనే వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సోవియట్ కాలంలో నిర్మించిన పొటాష్ గనిపై నిర్మించిన బెరెజ్నికి గురించి. ఇది 19వ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీత కోసం నిరంతర త్రవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం మునిగిపోయే జోన్‌కి వచ్చింది. ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.

Sinking City: మానవ స్వార్ధానికి కుంగిపోతున్న భూమి .. నగరం విడిచి వెళ్ళడానికి రెడీ అవుతున్న ప్రజలు
A Sinking City
Surya Kala
|

Updated on: Apr 03, 2024 | 10:10 AM

Share

రోజు రోజుకీ ప్రపంచంలోని జనాభా సంఖ్య పెరిగిపోతోంది. అయితే జనాభాకు తగిన అవసరాలు పెరగడం లేదు. ముఖ్యంగా భూమి మీద నివసించే మనిషి తన అవసరాల కోసం స్వార్థంతో దోపిడీ చేస్తున్నాడు. చెట్లను నరుకుతున్నాడు. అడవులను మానవ నివాసాలుగా మారుస్తూ ప్రకృతికి హానికరంగా మారుతున్నాడు. దీంతో భూమి మెల్లమెల్లగా మానవులపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. అయినప్పటికీ మనిషి ఏమీ ఆలోచించకుండా భూమిని దోపిడీ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఇలాంటి ప్రదేశమే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరాఖండ్‌లోని జోషి మఠం గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ భూమి క్షీణించిందనే వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సోవియట్ కాలంలో నిర్మించిన పొటాష్ గనిపై నిర్మించిన బెరెజ్నికి గురించి. ఇది 19వ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీత కోసం నిరంతర త్రవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం మునిగిపోయే జోన్‌కి వచ్చింది. ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.

నగరం ఎందుకు ప్రత్యేకం?

మీడియా నివేదికల ప్రకారం నిరంతర త్రవ్వకాల కారణంగా భూమి కింద లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఇవి ఒక గుహలాగా కనిపిస్తాయి. వీటి పైకప్పులు ఉప్పు స్తంభాలపై ఉన్నాయి. ఈ స్థలం గురించి 2006 సంవత్సరంలో ఒక నివేదిక వచ్చింది దాని ప్రకారం గనిలో 720 నుంచి 1,500 అడుగుల దిగువన ఉన్న మంచినీటి బుగ్గ ప్రవహించడం ప్రారంభించింది. ఇది ఉప్పు గోడలు, స్తంభాలను నాశనం చేసింది. దీంతో నగరమే కూలిపోవడంతో ప్రజలు వలసలు వెళ్లడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఈ నగరం ప్రపంచంలోని 10% పొటాష్ అవసరాలను తీరుస్తుంది. ఈ గని వల్ల ఇక్కడ నివసిస్తున్న చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ గనిని మూసివేస్తే ఇక్కడి ప్రజల ఉద్యోగాలు ఏమవుతాయనే ప్రమాదం ప్రజలకు పొంచి ఉంది. ఈ సమస్య కారణంగా 2019 సంవత్సరంలో 12,000 మంది బెరెజ్నికీని విడిచిపెట్టారు. ఇప్పుడు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్న వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..