AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటి కోసం బోరు తవ్వించాడు.. చివరికీ బంగారు పొడి రావడంతో అందరూ షాక్

ఇంటివద్ద కానీ, వ్యవసాయ క్షేత్రాల్లో గాన్ని నీటి కోసం బోరు బావిలు వేయించుకోవడం సాధరణమే. నీటితో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చాలా మంది బోరు వేసుకోవడానికే ఆసక్తి చూపుతారు. ఒక్కసారి బోరు వేస్తే నీరు బయటకు వస్తే ఆ కుటంబానికి వచ్చే ఆనందమే వేరు.

నీటి కోసం బోరు తవ్వించాడు.. చివరికీ బంగారు పొడి రావడంతో అందరూ షాక్
Borewell
Aravind B
|

Updated on: Mar 26, 2023 | 9:15 AM

Share

ఇంటివద్ద కానీ, వ్యవసాయ క్షేత్రాల్లో గాన్ని నీటి కోసం బోరు బావిలు వేయించుకోవడం సాధరణమే. నీటితో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చాలా మంది బోరు వేసుకోవడానికే ఆసక్తి చూపుతారు. ఒక్కసారి బోరు వేస్తే నీరు బయటకు వస్తే ఆ కుటంబానికి వచ్చే ఆనందమే వేరు. ఈ బోరు బావులు ఉంటే ఎవరికైనా గాని నీటి కొరత అనేదే ఉండదు. అయితే సాధరణంగా ఎవరైన బోరు వేయించుకుంటే.. ఆ బోరు వేసే సిబ్బంది భూమి లోపలికి పైపులు పంపించి డ్రిల్లింగ్ చేస్తారు. ఇలా డ్రిల్లింగ్ చేసే ప్రక్రియలో బండ రాళ్లు కూడా వస్తాయి. ఇంకా లోతుకి వెళ్లాక బురుద వస్తోంది. బురద వచ్చిందంటే అక్కడ నీరు ఉన్నట్లే. ఆ కుటుంబం పంట పండినట్లే. అయితే ఒడిశాలోని ఓ బోరు వేస్తే బురుదదో పాటు బంగారు రంగుతో కూడిన పొడి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరించింది.

వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని బొలంగీర్ జిల్లా రంచన బహాలి గ్రామంలో మహమ్మద్ జావెద్ అనే రైతు తన పొలంలో బోరు తవ్వించాడు. రెండు రోజుల నుంచి బోరు తవ్వుతుండగా అందులో నుంచి ఒక్కసారిగా బంగారు రంగుతో కూడిన పోడి వస్తోంది. దీన్ని చూసి అక్కడి స్థానికులు షాకైపోయారు. దీంతో బంగారం బయటకు వస్తుందనే ప్రచారం ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. అయితే ఈ విషయాన్ని జావెద్ అధికారులు తెలియజేశాడు. అక్కడికి వచ్చిన మండల తహశీల్దార్ తో పాటు ఇతర అధికారులు మట్టి నమూనాను సేకరించారు. అనంతరం బోరును సీజ్ చేశారు. సేకరించిన మట్టి నమూనాను ల్యాబ్ కు పంపించామని… పరీక్షలు పూర్తయ్యాక అది నిజమైన బంగారమా లేక వేరే ధాతువ అనే విషయం బయటపడుతుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..