AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lions For Sale: ఈ సింహాలను కొనాలనుకుంటున్నారా అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..

ఈ బంపర్ ఆఫర్ దక్కించుకోవాలనుకునేవారు ముందుగా రిజిస్టేషన్ చేసుకోవల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రకారం ఈ సింహాలను దక్కించుకోవచ్చు. అధికారుల అంచనా ప్రకారం కొనేందుకు దేశీయంగా ఎవరూ రాకపోవచ్చని..

Lions For Sale: ఈ సింహాలను కొనాలనుకుంటున్నారా అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..
Lions
Sanjay Kasula
|

Updated on: Jul 30, 2022 | 9:11 PM

Share

‘అడవి రాజు’ అని పిలిచే సింహం(lions) కంటే గేదె ధర ఎక్కువగా ఉంటుందని మీరు ఎప్పుడైనా విన్నారా. ఇది ఎలా జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారా.. కానీ ఇది నిజంగా జరిగింది. విషయం ఏంటో తెలిస్తే షాకవుతారు. భారతదేశ పొరుగు దేశం పాకిస్థాన్‌లో గేదె కంటే తక్కువ ధర ఉన్న సింహాలను విక్రయిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వివరాలను సమా టీవీ వెల్లడించింది. వారు అందించిన సమాచారం ప్రకారం, లాహోర్ సఫారీ జూ పరిపాలన దాని ఆఫ్రికన్ సింహాలలో కొన్నింటిని నామమాత్రపు ధర రూ. 1,50,000 (Pakistan) సింహానికి విక్రయించడానికి సిద్ధంగా ఉంది. పోల్చి చూస్తే, ఒక గేదె ఆన్‌లైన్ మార్కెట్‌లో రూ. 3,50,000 నుంచి రూ. 10 లక్షల వరకు లభ్యమవుతుంది.

ఆగస్ట్‌లో 12 సింహాలు అమ్ముకం!

అయితే ఈ బంపర్ ఆఫర్ దక్కించుకోవాలనుకునేవారు ముందుగా రిజిస్టేషన్ చేసుకోవల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రకారం ఈ సింహాలను దక్కించుకోవచ్చు. అధికారుల అంచనా ప్రకారం కొనేందుకు దేశీయంగా ఎవరూ రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దుబాయ్, సౌదీ దేశాల నుంచి కొనేందుకు వచ్చే అవకావం ఉందిన అనుకుంటున్నారు. వీరు మొదటి దశలో మూడు సింహాలను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఒక్కటొక్కటిగా వేలం వేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీటికి రోజు అవుతున్న ఖర్చు తడిసి మోపెడు అవుతుండటమే దీనికి కారణం. లాహోర్ సఫారీ జూ యాజమాన్యం ఆగస్టు మొదటి వారంలో తన 12 సింహాలను విక్రయించాలని భావిస్తోంది. తద్వారా డబ్బును సేకరించవచ్చు. అమ్మకానికి మూడు సింహాలు ఉన్నాయి. వీటిని ప్రైవేట్ హౌసింగ్ స్కీమ్‌లు లేదా పశుసంవర్ధక ఔత్సాహికులకు చాలా సరసమైన ధరలకు విక్రయించనున్నారు.

పాకిస్థాన్ ఆర్థికంగా దివాళా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కూడా శ్రీలంక బాటలోనే ఎక్కువ లేదా తక్కువ అవడానికి కారణం ఇదే. అస్థిరమైన ఆర్థిక పరిస్థితిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఆస్తులను విదేశీయులకు విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో లాహోర్ లోనే మంచి జాతి గేదె సింహం ధరకు మూడింతలు పలుకుతుండగా, లాహోర్ సఫారీ జూ కేవలం లక్షన్నర రూపాయలకే అడవి రాజును విక్రయించేందుకు సిద్ధమవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం